E-Air Taxis: 2026 నాటికి భారత్లో ఈ-ఎయిర్ టాక్సీ సేవలు.. 90 నిమిషాల కార్ జర్నీ 7 నిమిషాల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిలువగా ఎగిరే ఈ బుల్లి విమానాలు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులైన ఎలక్ట్రిసిటీపై ఇవి పనిచేయనున్నాయి.
READ ALSO: Kannappa: సినిమా ఏమో కానీ స్టార్లతో చంపేస్తున్న మంచు విష్ణు
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
భారతదేశ ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోకి మద్దతు ఇస్తున్న ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, యూఎస్కి చెందిన ఆర్చర్ ఏవియేషన్ కలిసి 2026లో ఇండియాలో ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది. రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందిన తర్వాత ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవల్ని ప్రవేశపెట్టనున్నారు. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రజలు సులభంగా ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీంతో పాటు కాలుష్యం కూడా ఉండదు.
ఆర్చర్ ఏవియేషన్, బోయింగ్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ వంటి వాటి మద్దతుతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్(eVTOL) విమానాలను తయారు చేసింది. వీటిని అర్బన్ ఎయిర్ మొబిలిటీకి సంబంధించి భవిష్యత్తుగా భావిస్తున్నారు.
ఈ ‘మిడ్ నైట్’ ఈ-విమానాల్లో నలుగురు ప్రయాణికులతో పాటు పైలట్ 161 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 200 విమానాలతో ప్రారంభించి, వీటిని దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూర్ నగరాల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 60-90 కారులో ప్రయాణించే దూరాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఎయిర్ టాక్సీల ద్వారా చేరవచ్చు. ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ మరియు చార్టర్ సేవల కోసం ఇ-విమానాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది. ఆర్చర్ కంపెనీ ఆరు మిడ్ నైట్ ఎయిర్ క్రాఫ్టులను అందించడానికి జూలైలో యూఎస్ వైమానిక దళం నుంచి 142 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అక్టోబర్ నెలలో యూఏఈలో ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.
- Tags
- Air Taxis
- E-Air Taxis
- india
- indigo
- USA
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?