India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు
- భారత ప్రభుత్వం మరోసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ
- ఇరాన్లో ఉన్న భారతీయులకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మరోసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా సూచనల ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారత పౌరులు ఇరాన్కు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇటీవల పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, పూర్తిస్థాయిలో సాధారణ స్థితి నెలకొనలేదని రాయబార కార్యాలయం పేర్కొంది.
అనవసర ప్రయాణాలు మానుకోవాలి
రాయబార కార్యాలయం ప్రకారం, అవసరం లేకపోతే ప్రస్తుతం ఇరాన్కు ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా తదుపరి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది.
Also Read
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
ఇరాన్లో ఉన్న భారతీయులకు కీలక సూచనలు
ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న లేదా అక్కడికి అత్యవసరంగా వెళ్లాల్సిన భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సూచనలను పాటించాలి. తాజా భద్రతా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలి. భారత రాయబార కార్యాలయంతో నిరంతర టచ్ లో ఉండాలి అని సూచించింది.
రాయబార కార్యాలయంలో నమోదు తప్పనిసరి
ఇరాన్లో ఉన్న భారత పౌరులు, అలాగే త్వరలో అక్కడికి వెళ్లే వారు తమ వివరాలను టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఈ నమోదు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శాంతి చర్చల తర్వాత వచ్చిన సలహా
ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని సమాచారం వచ్చినప్పటికీ, భద్రతా పరమైన అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదని అధికారులు భావిస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం జాగ్రత్త వైఖరిని కొనసాగిస్తోంది.
అధికారిక సమాచారం ఎక్కడ చూడాలి?
భారత పౌరులు తాజా సూచనలు, భద్రతా హెచ్చరికలు, అత్యవసర సమాచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారిక వెబ్సైట్, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
— India in Iran (@India_in_Iran) June 24, 2026
తాజావార్తలు
-
India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!