Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Internet Users Cross 950 Million In 2025 Rural India Leads Digital Growth Report

Internet Users: భారత్‌లో 95 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు.. గ్రామీణులదే ఆధిపత్యం….

Published Date :January 29, 2026 , 5:33 pm
By Venu Goapl Reddy
  • భారత్‌లో 95 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు..
  • గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వినియోగదారులు..
Internet Users: భారత్‌లో 95 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు.. గ్రామీణులదే ఆధిపత్యం….
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Internet User: భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏకంగా 95 కోట్ల మంది దేశంలో ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం, పెరుగుతున్న షార్ట్ వీడియో వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్((AI) స్వీకరణ పెరగడం వంటి కారణాలతో 2025లో భారత ఇంటర్నెట్ యూజర్లు సంఖ్య 95 కోట్ల మైలురాయిని దాటినట్లు గురువారం ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.

‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025’ను కర్ణాటక ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ/బీటీ అండ్ సైన్స్ & టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యదర్శి మంజుల ఎన్ ఈ రిపోర్టును ఇండియా డిజిటల్ సమ్మిట్‌లో విడుదల చేశారు. భారత్‌లో ప్రస్తుతం 95.8 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇది సుమారు 8 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ స్థానం మరింత బలోపేతం అయింది.

Also Read

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
Add as a preferred
source on google

Read Also: NCP Crisis: పవార్ మరణం తర్వాత ‘‘పవర్’’ పాలిటిక్స్.. డిప్యూటీ సీఏంగా సునేత్ర పవార్..!

44 శాతం మంది వినియోగదారులు వాయిస్ సెర్చ్, ఇమేజ్ ఆధారిత సెర్చ్, చాట్‌బాట్‌లు, ఏఐ ఫిల్టర్స్, ఏఐ-ఎనెబుల్డ్ ఫీచర్‌లను వాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా గ్రామీన ప్రాంతాల్లో పెరుగుతున్న యూజర్లు, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతున్నారని నివేదిక తెలిపింది. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే దాదాపుగా 55 కోట్ల మంది క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. గ్రామీణ వినియోగదారులే 57 శాతం ఉన్నట్లు చెప్పింది. పట్టణ యూజర్ల కన్నా గ్రామీణ యూజర్ల పెరుగుదల నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.

15-24 ఏళ్ల వయసువారిలో 57 శాతం, 25-44 ఏళ్ల వయసు వారిలో 52 శాతం మంది ఏఐ ఫీచర్లను ఉపయోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది. డిజిటల్ వినియోగంలో ముఖ్యంగా షార్ట్ వీడియో కంటెంట్ కీలక వృద్ధి కారకంగా ఉందని చెప్పింది. డిజిటల్ వాడకానికి ముఖ్యంగా యువతే ప్రధాన కారణంగా మారిందని వెల్లడించింది. ఇదే కాకుండా ఇ-కామర్స్ వినియోగం చాలా పెరిగిందని, ఇది సాంప్రదాయ ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌ను దాటి విస్తరిస్తోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో 56 శాతం మంది గతేడాది ఆన్‌లైన్ షాపింగ్ చేశారు.

19.3 కోట్ల మంది మల్టీ డివైస్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇది మొత్తం యాక్టివ్ యూజర్లలో 20 శాతంగా ఉంది. 2024లో ఇది 16.5 కోట్లుగా ఉండేది. పట్టణాల్లో మల్టీ డివైజ్ వినియోగం 31 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 12 శాతం ఉంది. ఇదిలా ఉంటే, 18 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇతరుల మొబైల్ ద్వారా ఇంటర్నెట్ షేర్ ద్వారా సేవల్ని పొందుతున్నారు. వీరిలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. భారత జనాభాలో 38 శాతం, అంటే సుమారుగా 57.9 కోట్ల మంది ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI usage India
  • digital economy India
  • digital India report 2025
  • e-commerce growth India
  • IAMAI report

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions