Su-57 fighter Jet: ఆపరేషన్ సిందూర్ తర్వాత మన ‘‘ఎయిర్ పవర్’’ ఏంటో పాకిస్తాన్కు అర్థమైంది. భవిష్యత్ సంఘర్షణల్లో ఎయిర్ఫోర్స్ కీలకమనేది స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. శత్రువులతో యుద్ధం మాత్రమే కాకుండా, శత్రు రాడార్లకు దొరకకుండా దాడి చేసే ‘‘5వ తరం యుద్ధ విమానాల’’ కొనుగోలుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రష్యా తయారీ సుఖోయ్ సు -57ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళంలో రాఫెల్ 4.5 జనరేషన్ యుద్ధ విమానాలుగా భావిస్తున్నారు. 5వ తరం యుద్ధ విమానాలు మన దగ్గర లేవు. దీంతో 40 జెట్లను ఆర్డర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
యుద్ధ సామర్థ్యాలే కాకుండా, స్టెల్త్ సామర్థ్యాన్ని సు -57ను కలిగి ఉంది. ఐదోతరం యుద్ధ విమానాల్లో ఇంటిగ్రేటెడ్ ఏవియానికస్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇందులో ఆటోమేషన్ ఉంటుంది, పోరాట సమయంలో పైలట్ నిర్ణయాలను త్వరితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. భూమిపై ఉన్న కంట్రోల్ సిస్టమ్స్, ఇతర విమానాలతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటతుంది. ఇది ఆకాశంలో ఎదురుదాడి చేయడమే కాకుండా, భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేస్తుంది.
ప్రస్తుతం చైనా, రష్యా, అమెరికా వద్ద 5వ తరం జెట్ విమానాలు ఉన్నాయి. చైనా వద్ద జే-20 (J-20) స్టెల్త్ విమానాలు ఉన్నాయి. వీటిని పాకిస్తాన్ కూడా కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వద్ద కూడా 5వ తరం యుద్ధ విమానాల తప్పనిసరి ఏర్పడింది. ప్రస్తుతం భారత్ సొంతగా AMCA (Advanced Medium Combat Aircraft) అనే 5వ తరం విమానాన్ని తయారు చేస్తోంది. ఇది 2035 నాటికి గానీ సైన్యంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ లోపే ఏర్పడే ఖాళీని రష్యన్ సు-57తో పూడ్చాలని భావిస్తోంది.
