NTV Telugu Site icon

కరోనా కల్లోలం.. 900 దాటిన మృతులు..

India COVID 19

India-COVID 19

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.. రెండవ విడతలో రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. మరోసారి లక్షదాటాయి రోజువారి కేసుల సంఖ్య… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… ఇదే సమయంలో 904 మంది కన్నుమూశారు.. ఇక, 75,086 మంది కోలుకున్నారు.. దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529కు పెరిగింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 12,01,009గా ఉండగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,70,179కు పెరిగింది..

దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 89.86 శాతంగా ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొది కేంద్రం… ఇక, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.88 శాతంగా ఉండగా… మరణాల రేటు 1.26 శాతంగా ఉంది.. మరోవైపు.. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” నిర్దారణ పరీక్షల సంఖ్య 11,80,136గా ఉందని.. ఇదే సమయంలో 29,33,418 మంది వ్యాక్సినేషన్‌ అందించినట్టు వెల్లడించింది కేంద్రం..