దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 3,157 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345కి చేరింది. అటు కరోనా కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కరోనా బారి నుండి 2,723 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 19,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. దేశ రాజధానిలో 1,485 కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. అటు మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,89,23,98,347 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో ఆదివారం 4,02,170 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
