Sri Lanka: ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు.. భారత్ తీవ్ర నిరసన
- ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు
- తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
- రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నేవీ దుందుడుకుగా ప్రవర్తించింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు జాఫ్నా బోధనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీలంక నేవీ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేవీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం కచ్చితంగా అవసరం అని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
మంగళవారం డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో 13 మంది భారతీయ మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా.. లంక నేవీ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో శ్రీలంక నావికాదళం కాల్పులకు తెగబడింది. తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన జాలర్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా భారత్ తెలిపింది. మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని.. సహాయాన్ని అందిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Donald Trump: సుంకాల విషయంలో భారత్కి ట్రంప్ వార్నింగ్..
ఇక కాల్పుల ఘటనపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. న్యూఢిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొలంబోలోని భారత హైకమిషన్ శ్రీలంక ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు ప్రకటన తెలిపింది. జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని.. మత్స్యకారుల సమస్యలను మానవీయ కోణంలో.. మానవతా దృక్పథంతో చూడాలని భారత్ కోరింది. ఇలాంటి విధానం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Vivo T3x 5G: వివో 5G ఫోన్ పై బ్లాక్ బస్టర్ డీల్.. పిచ్చెక్కించే ఫీచర్లు.. దీనిపై ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!