Sri Lanka: ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు.. భారత్ తీవ్ర నిరసన
- ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు
- తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
- రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నేవీ దుందుడుకుగా ప్రవర్తించింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు జాఫ్నా బోధనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీలంక నేవీ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేవీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం కచ్చితంగా అవసరం అని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి..
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
మంగళవారం డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో 13 మంది భారతీయ మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా.. లంక నేవీ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో శ్రీలంక నావికాదళం కాల్పులకు తెగబడింది. తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన జాలర్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా భారత్ తెలిపింది. మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని.. సహాయాన్ని అందిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Donald Trump: సుంకాల విషయంలో భారత్కి ట్రంప్ వార్నింగ్..
ఇక కాల్పుల ఘటనపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. న్యూఢిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొలంబోలోని భారత హైకమిషన్ శ్రీలంక ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు ప్రకటన తెలిపింది. జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని.. మత్స్యకారుల సమస్యలను మానవీయ కోణంలో.. మానవతా దృక్పథంతో చూడాలని భారత్ కోరింది. ఇలాంటి విధానం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Vivo T3x 5G: వివో 5G ఫోన్ పై బ్లాక్ బస్టర్ డీల్.. పిచ్చెక్కించే ఫీచర్లు.. దీనిపై ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!