Sri Lanka: ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు.. భారత్ తీవ్ర నిరసన
- ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు
- తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
- రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నేవీ దుందుడుకుగా ప్రవర్తించింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు జాఫ్నా బోధనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీలంక నేవీ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేవీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం కచ్చితంగా అవసరం అని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి..
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
మంగళవారం డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో 13 మంది భారతీయ మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా.. లంక నేవీ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో శ్రీలంక నావికాదళం కాల్పులకు తెగబడింది. తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన జాలర్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా భారత్ తెలిపింది. మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని.. సహాయాన్ని అందిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Donald Trump: సుంకాల విషయంలో భారత్కి ట్రంప్ వార్నింగ్..
ఇక కాల్పుల ఘటనపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. న్యూఢిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొలంబోలోని భారత హైకమిషన్ శ్రీలంక ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు ప్రకటన తెలిపింది. జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని.. మత్స్యకారుల సమస్యలను మానవీయ కోణంలో.. మానవతా దృక్పథంతో చూడాలని భారత్ కోరింది. ఇలాంటి విధానం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Vivo T3x 5G: వివో 5G ఫోన్ పై బ్లాక్ బస్టర్ డీల్.. పిచ్చెక్కించే ఫీచర్లు.. దీనిపై ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!