ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,37,222 కి చేరింది.
read also : ఇవాళ బంగాళఖాతంలో అల్పపీడనం…తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
ఇందులో 2,99,75,064 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 4,54,118 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 895 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,08,040 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 41,526 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
