Site icon NTV Telugu

LPG production: ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్‌న్యూస్..

Gas

Gas

LPG production: ఇరాన్ యుద్ధం దేశ ఇంధర రంగంపై ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేయడంతో భారత్‌తో సహా ఆసియా, ఇతర దేశాలు సంక్షోభం వైపు పయణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రొడక్షన్ నిలిపేశాయి. దీంతో, దేశంలో ఇంధన భయాలు పెరిగాయి.

Read Also: Medak: దేవుడా..! తాగుడుకు డబ్బులు లేవని బిడ్డను అమ్మేసిన తల్లి

ఇదిలా ఉంటే, దేశంలో LPG కొరత లేదని మరియు వాణిజ్య సిలిండర్ల కొరత గురించి ఆందోళనలు తలెత్తిన తర్వాత సరఫరాలు స్థిరీకరించబడ్డాయని ప్రభుత్వం మంగళవారం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను అనుసరించి, చమురు శుద్ధి కర్మాగారాలు LPG ఉత్పత్తిని దాదాపు 10% పెంచాయనే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇదే కాకుండా గ్యాస్ కృత్రిమ కొరతను నివారించేందుకు గ్యాస్ బుకింగ్స్ కాలాన్ని 25 రోజులకు పెంచినట్లు చెప్పింది. అక్రమ స్టోరేజ్‌ను అరికట్టడానికి, పంపిణీని నిర్ధారించడానికి ప్రభుత్వం నిత్యవసర చట్టం కింద నిబంధనల్ని అమలు చేసిందని అధికారులు చెప్పారు.

తాత్కాలిక ఆందోళన్ని ప్రభుత్వం పరిష్కరించిందని, ఇప్పుడు పరిస్థితిని పరిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్ని రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. భారత్ ఇతర దేశాలతో పోలిస్తే ఇంధన విషయంలో చాలా మెరుగైన స్థితిలో ఉందని వెల్లడించారు. ఇంధన లభ్యతను నిర్ధారించుకోవడానికి భారత్ ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. దేశంలో తగినంత ఇంధన లభ్యత ఉందని, సోషల్ మీడియాలో వ్యాపించే సమాచారంపై ఆధారపడి భయపడోద్దని ప్రజల్ని కేంద్రం కోరింది.

Exit mobile version