INDIA bloc: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ..
INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది. అయితే, ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోడీ మూడో సారి అధికారంలోకి వస్తారని చెప్పాయి. అయితే, ఇండియా కూటమి తాము 295+ స్థానాలు గెలుస్తామని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, ఫలితాలు వెలువడే ఈ రోజు ఇండియా కూటమి నేతలు ఢిల్లీకి రాబోతునున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాలను చర్చించడానికి సమావేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జూన్ 1న ఎన్నికల ముగిసన తర్వాత కూటమి నేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. మంగళవారం(ఈ రోజు) సాయంత్రం లేదా బుధవారం ఉదయం కూటమి నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?
జూన్ 1న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మరియు కెసి వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్, టి ఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి రాజా, దీపాంకరిత్ భట్టాచార్య మరియు దీపాంకరిత్ భట్టాచార్య, సమావేశానికి హాజరయ్యారు.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. జూన్ 1 సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. తాము 543 స్థానాలకు గానూ 295+ స్థానాలు సాధిస్తామని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!