INDIA bloc: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది. అయితే, ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోడీ మూడో సారి అధికారంలోకి వస్తారని చెప్పాయి. అయితే, ఇండియా కూటమి తాము 295+ స్థానాలు గెలుస్తామని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, ఫలితాలు వెలువడే ఈ రోజు ఇండియా కూటమి నేతలు ఢిల్లీకి రాబోతునున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాలను చర్చించడానికి సమావేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జూన్ 1న ఎన్నికల ముగిసన తర్వాత కూటమి నేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. మంగళవారం(ఈ రోజు) సాయంత్రం లేదా బుధవారం ఉదయం కూటమి నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
Read Also: BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?
జూన్ 1న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మరియు కెసి వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్, టి ఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి రాజా, దీపాంకరిత్ భట్టాచార్య మరియు దీపాంకరిత్ భట్టాచార్య, సమావేశానికి హాజరయ్యారు.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. జూన్ 1 సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. తాము 543 స్థానాలకు గానూ 295+ స్థానాలు సాధిస్తామని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
-
Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!