INDIA bloc: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది. అయితే, ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోడీ మూడో సారి అధికారంలోకి వస్తారని చెప్పాయి. అయితే, ఇండియా కూటమి తాము 295+ స్థానాలు గెలుస్తామని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, ఫలితాలు వెలువడే ఈ రోజు ఇండియా కూటమి నేతలు ఢిల్లీకి రాబోతునున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాలను చర్చించడానికి సమావేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జూన్ 1న ఎన్నికల ముగిసన తర్వాత కూటమి నేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. మంగళవారం(ఈ రోజు) సాయంత్రం లేదా బుధవారం ఉదయం కూటమి నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Also Read
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
Read Also: BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?
జూన్ 1న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మరియు కెసి వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్, టి ఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి రాజా, దీపాంకరిత్ భట్టాచార్య మరియు దీపాంకరిత్ భట్టాచార్య, సమావేశానికి హాజరయ్యారు.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. జూన్ 1 సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. తాము 543 స్థానాలకు గానూ 295+ స్థానాలు సాధిస్తామని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
తాజావార్తలు
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!