INDIA Alliance: కుప్పకూలుతున్న ఇండియా కూటమి.. పట్టుబిగిస్తున్న ఎన్డీయే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDI Alliance: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో సంచలన ఫలితాలు విడుదలయ్యాయి. బెంగాల్ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అస్సాంలో ఏక పక్షంగా బీజేపీ విజయం సాధిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీయే అధికారంలోకి రాబోతోంది. కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారం చేపట్టబోతోంది. తమిళనాడులో 40 ఏళ్లుగా సాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకేల పాలనకు రెండేళ్ల వ్యవధిలోనే విజయ్ టీవీకే బిగ్ షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ మొత్తం రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఇండియా కూటమి కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇండియ కూటమిలో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు చిత్తుగా ఓడిపోయాయి. 2029 లోక్సభ ఎన్నికల వరకు మళ్లీ ఇండియా కూటమి ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలు కూటమికిగా బీజేపీని ఎదుర్కొనేందుకు పోటీ చేశాయి. అయితే, ఈ ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యాయి. బీజేపీ నేరుగా అధికారాన్ని చేపట్టేంత సీట్లు దక్కించుకోలేకపోయింది. మిత్రపక్షాల మద్దతుతో అధికారాన్ని ఏర్పాటు చేసింది.
Also Read
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
- Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Lok Sabha: లోక్సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
Read Also: Vijay Emerges as King: అందరూ కింగ్మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
అయితే, దీని తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించుకుంటూ వస్తోంది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లో ఘన విజయాలు సాధించింది. ఎన్డీయే కూటమిగా బీజేపీ సత్తా చూటుతోంది. అన్నింటి కన్నా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని అధికారం నుంచి దించడం బీజేపీ సత్తాను మరోసారి పరిచయం చేసింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ విషయాలపై స్పందిస్తూ.. 2029 వరకు ఈ విజయాలను గుర్తుంచుకుంటారని చెప్పడం చూస్తే, ఈ విజయాల ప్రభావం ఎలాంటిదో అర్థం అవుతుంది.
హిందీ, హిందూ వ్యతిరేక భావజాలం కూడా చాలా రోజులు పనిచేయదనే విషయం డీఎంకే కూడా గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చింది. మైనారిటీ సంతుష్టీకరణ అన్ని వేళల్లో కుదరదని బెంగాల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఒక ఉదాహరణ ఇచ్చాయి. ఇదే విధంగా తమిళనాడులో డీఎంకే నేతల హిందూ వ్యతిరేక విధానాలు, వ్యాఖ్యలు కూడా ఓటమికి కారణమయ్యాయి. డీఎంకేపై ఉన్న వ్యతిరేకత టీవీకేకు వరంగా మారింది. దీంతో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న డీఎంకే ఇప్పుడు మూడో స్థానానికి పరిమితమైంది.
ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఇండియా కూటమి కూలిపోతున్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల విజయం రాబోయే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అధికారానికి దూరమై 10 ఏళ్లు అవుతోంది. ఇక బీహార్లో ఆర్జేడీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ కూడా అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోతోంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన నిజాలు..
-
PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!