Prajwal Revanna’s Father: నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయాలి.. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ..
- తప్పు చేస్తే నా కొడుకును ఉరితీయండి..
- అసెంబ్లీ వేదికగా ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ వ్యాఖ్యలు..
- అధికారులపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna’s Father: పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్పబడుతున్న వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు ప్రభావితమయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల తర్వాత ప్రజ్వల్ జర్మనీ పారిపోవడం, ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది.
Read Also: Karnataka: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బూట్లు మాయం.. పోలీసుల గాలింపు
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు తప్పుచేసినట్లు తేలితే ఉరితీయాలని మంగళవారం అన్నారు. కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ని లక్ష్యంగా చేసుకుంటూ, అతను ఆ పదవికి అన్ ఫిట్ అని అన్నారు. ‘‘నా కొడుకు తప్పు చేస్తే ఉరితీయండి.. నేను దీనికి నో చెప్పను’’ అని అన్నారు. ఈ విషయాన్ని సమర్థించడానికి, చర్చ కోసం ఇక్కడకు రాలేదని, 25 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్నానని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. నాకు వ్యతిరేకంగా కొంతమంది స్త్రీని డీజీపీ ఆఫీసుకు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.
దీనిపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఆయన అధికారులపై ఆరోఫనలు చేస్తున్నారని, ఆయనకు అన్యాయం జరిగితే చర్చకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిని సిట్ విచారిస్తోంది. ఈ వ్యవహారం తర్వాత ప్రజ్వల్ని జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!