India-UK: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే పలు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ పాకిస్తాన్పై భారత్ జరిపిన దాడిని పాఠ్యాంశంగా చేర్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ వైమానిక దళం(IAF), యునైటెడ్ కింగ్డమ్(UK) ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వనుంది. భారత్-యూకే మధ్య సైనిక శిక్షణా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి.
Read Also: CM Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పవర్ఫుల్ కామెంట్స్..!
తాజా, ఒప్పందం ప్రకారం, ఐఏఎఫ్, యూకే రాయల్ ఎయిర్ఫోర్స్(RAF) పైలట్ల శిక్షణ కోసం ముగ్గురు అర్హత కలిగిన ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్లను (QFI) మోహరిస్తుంది. RAF వ్యాలీ బ్రిటిష్ ఫాస్ట్ జెట్ పైలట్లకు శిక్షణా స్థావరంగా పనిచేస్తుంది. ఈ ఫెసిలిటీ వద్ద బ్రిటిష్ పైలట్లకు భారతీయ QFIలు ఫాస్ట్ జెట్ శిక్షణ అందించనున్నారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ప్రారంభంలో ఈ విస్తరణ రెండు ఏళ్ల పాటు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజ్ క్రాన్వెల్ లో బోధకుడిగా భారతీయ వైమానిక దళ అధికారిని నియమించారు. ఇప్పుడు మూడు బ్రిటిష్ మిలిటరీ అకాడమీల్లోనూ భారత అధికారులు ఇన్స్ట్రక్టర్లుగా ఉన్నారు.
