India-UK: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే పలు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ పాకిస్తాన్పై భారత్ జరిపిన దాడిని పాఠ్యాంశంగా చేర్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ వైమానిక దళం(IAF), యునైటెడ్ కింగ్డమ్(UK) ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వనుంది. భారత్-యూకే మధ్య సైనిక శిక్షణా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి.