IAF Plane Crash: “అస్సాం గగనతలంలో ఘోర క్రాష్.. నేలకొరిగిన ఐదుగురు దేశ వీర జవానులు!”
- జోర్హాట్ రన్వేపై మృత్యుఘోష..
- ముక్కలైన యుద్ధ విమానం..
- హైలెవల్ ఎంక్వైరీకి ఆదేశించిన ఎయిర్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAF Plane Crash: భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఆంటోనోవ్ ఏఎన్-32 (An-32) రవాణా విమానం అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్ సమీపంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో దేశ సేవలో ఉన్న ఐదుగురు ధైర్యవంతులైన వైమానిక దళ సిబ్బంది వీరమరణం పొందారు. ఈ ప్రమాదంలో విమానం యొక్క కో-పైలట్ ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ ఐదుగురు వీర సైనికుల వివరాలు ఇవే..
స్క్వాడ్రన్ లీడర్ (Sqn Ldr) ప్రశాంత్ సింగ్
Also Read
- CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ఫ్లైట్ లెఫ్టినెంట్ (Flt Lt) శుభం కుమార్
సార్జెంట్ (Sgt) జితేంద్ర శర్మ
అగ్నివీర్వాయు ఖేమరం కుమావత్
అగ్నివీర్వాయు డానిష్ ఆలం
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, భారత వైమానిక దళం తక్షణమే స్పందించింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఒక ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరి’ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విచారణలో పరిగణనలోకి తీసుకోనున్న కీలక అంశాలు ఏంటంటే.. విమానంలో సాంకేతిక లోపాలు ఏమైనా తలెత్తాయా?, ఇంజిన్ వైఫల్యం ఏమైనా జరిగిందా, లేదా ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేవి కీలకం కానున్నాయి. ప్రమాద సమయంలో కాక్పిట్లో ఉన్న వారిలో కో-పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడటంతో, ప్రమాదం జరిగిన తీరును అర్థం చేసుకోవడానికి ఆయన ఇచ్చే వాంగ్మూలం (Statement) ఈ విచారణలో అత్యంత కీలకం కానుందని చెబుతున్నారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం అధికారికంగా స్పందిస్తూ, “ఈ విషాదకర ఘటనలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు భారత వాయుసేన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. ఈ కష్టకాలంలో అమరవీరుల కుటుంబాలకు వాయుసేన అండగా నిలుస్తుంది” అని పేర్కొంది. దేశ రక్షణలో అహర్నిశలు శ్రమించే వీర జవాన్ల మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వైమానిక దళం చేపట్టిన విచారణలో త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Deeply anguished by the loss of five Air Warriors in the An-32 accident at Jorhat, Assam.
Sqn Ldr Prashant Singh, Flt Lt Shubham Kumar, Sgt Jitendra Sharma, Agniveervayu Khemaram Kumawat and Agniveervayu Danish Alam made the supreme sacrifice in the line of duty. Their courage… https://t.co/eChXozjT85
— Rajnath Singh (@rajnathsingh) June 13, 2026
తాజావార్తలు
-
IAF Plane Crash: “అస్సాం గగనతలంలో ఘోర క్రాష్.. నేలకొరిగిన ఐదుగురు దేశ వీర జవానులు!”
-
Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!