High Court: “నలుపు రంగులో ఉందని భార్యకు విడాకులు”.. ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి విడాకుల పిటిషన్ని తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ‘‘చర్మం రంగు ఆధారంగా వివక్ష’’ని నిర్మూలించాలని పిలుపునిచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తన జీవిత భాగస్వామి తనను విడిచిపెట్టిందని వాదించాడు. అయితే డార్క్ కలర్ కారణంగా అవమానించబడి, ఇంటి నుంచి వెళ్లగొట్టబడినట్లు భార్య కోర్టుకు తెలిపింది.
2005లో వివాహం చేసుకున్న సదరు వ్యక్తిపై కోర్టు కఠినంగా స్పందించింది. ఈ కేసులో తమ తీర్పు ద్వారా ఇతరులు కూడా రంగు ఆధారంగా మనస్తత్వాన్ని ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. మానవజాతి మారాల్సిన అవసరం ఉందని, చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించకూడదని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
Read Also: Poonch attack: జవాన్లపై యూఎస్ రైఫిళ్లతో ఉగ్రవాదుల దాడి.. లష్కర్కి చెందిన ఉగ్రసంస్థ పని..
వైవాహిక భాగస్వాముల ఎంపికలో చర్మం రంగు పోషించే పాత్రపై అధ్యయనాలను, ఫేయిర్ నెస్ క్రీములపై కోర్టు సుదీర్ఘ చర్చలను, 2020 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ సవరణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. ఫెయిర్ స్కిన్ను ప్రమోట్ చేసే ప్రకటనలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పింది.
ముదురు రంగు చర్మం గల(మహిళలు) వారిని తక్కువగా చూపించడం, చర్మాన్ని కాంతివంతం చేసే సౌందర్య సాధనాలలో ఎక్కువ భాగం మహిళలను లక్ష్యంగా చేసుకుంటాయి. వారు తక్కువ రంగు చర్మం కలిగిన స్త్రీని తక్కువగా, తక్కువ కాన్ఫిడెంట్గా చూపించే ప్రయత్నం చేయడంతో పాటు జీవితంలో సక్సెస్ అవ్వలేరని చూపించే వారని అధ్యయనాలు సూచించాయని కోర్టు పేర్కొంది. కాబట్టి నల్లటి రంగు కంటే ఫెయిర్ స్కిన్కి ప్రాధాన్యత ఇవ్వడం అనే సమాజం యెక్క మైండ్ సెట్ మారాలని కోర్టు చెప్పింది. ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని కోర్టు చెప్పింది. ఇది క్రూరత్వానికి కారణం కాదని తాము భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తాజావార్తలు
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?