PM Modi: ఇది టెక్, డేటా నడిపించే శతాబ్దం.. అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోంది!
- ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ప్రధాని..
- భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి..
- ఇది టెక్, డేటా నడిపించే శతాబ్ధం అని తెలిపి ప్రధాని నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగనుంది. భారత్ చేసిన అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనబడుతుందని చెప్పుకొచ్చారు. కాగా, గత 10 ఏళ్లలో భారత్ 10 అతి పెద్ద ఆర్థికవ్యవస్థల నుంచి 5వ స్థానానికి చేరిందన్నారు. గత 15 ఏళ్లుగా ఆర్థికవ్యవస్థ మారడంతో ఎగుమతులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
Also Read
ఇక, దేశంలో ఎఫ్డీఐలు కూడా రెండింతలు పెరిగాయని నరేంద్ర మోడీ తెలిపారు. అలాగే, భారత్ లో ఇన్ఫ్రాపై వ్యయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు చేరాయన్నారు. వైవిధ్యభరితమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం చాలా మంచిదన్నారు. ఇంకా కొన్నేళ్ల పాటు మనం అత్యంత యువ దేశంగా ఉండబోతున్నామన్నారు. ప్రస్తుతం టెక్, డేటా నడిపించే శతాబ్ధం అని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లకు పైగా పెరిగిందన్నారు. ఇక, డిజిటల్ చెల్లింపుల్లో భారత్ భారీగా పుంజుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Adilabad: ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ.. డిమాండ్లు ఇవే..
కాగా, స్వాతంత్ర్యం వచ్చిన ప్రభుత్వాలు రాజస్థాన్ అభివృద్ధి, సంస్కృతిని బాగా నిర్లక్ష్యం చేశాయని ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. అందుకే ఈ రాష్ట్రం బాగా నష్టపోయిందన్నారు. వికాస్ భీ- విరాసత్ భీ అనే మంత్రంతో మా సర్కార్ పని చేస్తోంది.. పెట్టుబడులకు రాజస్థాన్లోని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్లో అతి పెద్ద సోలార్ పార్కుల్లో చాలా వరకు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు ఎయిర్ కార్గో కాంప్లెక్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని నరేంద్ర మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!