PM Modi: ఇది టెక్, డేటా నడిపించే శతాబ్దం.. అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోంది!
- ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ప్రధాని..
- భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి..
- ఇది టెక్, డేటా నడిపించే శతాబ్ధం అని తెలిపి ప్రధాని నరేంద్ర మోడీ
PM Modi: ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగనుంది. భారత్ చేసిన అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనబడుతుందని చెప్పుకొచ్చారు. కాగా, గత 10 ఏళ్లలో భారత్ 10 అతి పెద్ద ఆర్థికవ్యవస్థల నుంచి 5వ స్థానానికి చేరిందన్నారు. గత 15 ఏళ్లుగా ఆర్థికవ్యవస్థ మారడంతో ఎగుమతులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
ఇక, దేశంలో ఎఫ్డీఐలు కూడా రెండింతలు పెరిగాయని నరేంద్ర మోడీ తెలిపారు. అలాగే, భారత్ లో ఇన్ఫ్రాపై వ్యయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు చేరాయన్నారు. వైవిధ్యభరితమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం చాలా మంచిదన్నారు. ఇంకా కొన్నేళ్ల పాటు మనం అత్యంత యువ దేశంగా ఉండబోతున్నామన్నారు. ప్రస్తుతం టెక్, డేటా నడిపించే శతాబ్ధం అని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లకు పైగా పెరిగిందన్నారు. ఇక, డిజిటల్ చెల్లింపుల్లో భారత్ భారీగా పుంజుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Adilabad: ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ.. డిమాండ్లు ఇవే..
కాగా, స్వాతంత్ర్యం వచ్చిన ప్రభుత్వాలు రాజస్థాన్ అభివృద్ధి, సంస్కృతిని బాగా నిర్లక్ష్యం చేశాయని ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. అందుకే ఈ రాష్ట్రం బాగా నష్టపోయిందన్నారు. వికాస్ భీ- విరాసత్ భీ అనే మంత్రంతో మా సర్కార్ పని చేస్తోంది.. పెట్టుబడులకు రాజస్థాన్లోని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్లో అతి పెద్ద సోలార్ పార్కుల్లో చాలా వరకు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు ఎయిర్ కార్గో కాంప్లెక్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని నరేంద్ర మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!