PM Modi: ఇది టెక్, డేటా నడిపించే శతాబ్దం.. అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోంది!
- ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ప్రధాని..
- భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి..
- ఇది టెక్, డేటా నడిపించే శతాబ్ధం అని తెలిపి ప్రధాని నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగనుంది. భారత్ చేసిన అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనబడుతుందని చెప్పుకొచ్చారు. కాగా, గత 10 ఏళ్లలో భారత్ 10 అతి పెద్ద ఆర్థికవ్యవస్థల నుంచి 5వ స్థానానికి చేరిందన్నారు. గత 15 ఏళ్లుగా ఆర్థికవ్యవస్థ మారడంతో ఎగుమతులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
Also Read
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
ఇక, దేశంలో ఎఫ్డీఐలు కూడా రెండింతలు పెరిగాయని నరేంద్ర మోడీ తెలిపారు. అలాగే, భారత్ లో ఇన్ఫ్రాపై వ్యయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు చేరాయన్నారు. వైవిధ్యభరితమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం చాలా మంచిదన్నారు. ఇంకా కొన్నేళ్ల పాటు మనం అత్యంత యువ దేశంగా ఉండబోతున్నామన్నారు. ప్రస్తుతం టెక్, డేటా నడిపించే శతాబ్ధం అని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లకు పైగా పెరిగిందన్నారు. ఇక, డిజిటల్ చెల్లింపుల్లో భారత్ భారీగా పుంజుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Adilabad: ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ.. డిమాండ్లు ఇవే..
కాగా, స్వాతంత్ర్యం వచ్చిన ప్రభుత్వాలు రాజస్థాన్ అభివృద్ధి, సంస్కృతిని బాగా నిర్లక్ష్యం చేశాయని ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. అందుకే ఈ రాష్ట్రం బాగా నష్టపోయిందన్నారు. వికాస్ భీ- విరాసత్ భీ అనే మంత్రంతో మా సర్కార్ పని చేస్తోంది.. పెట్టుబడులకు రాజస్థాన్లోని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్లో అతి పెద్ద సోలార్ పార్కుల్లో చాలా వరకు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు ఎయిర్ కార్గో కాంప్లెక్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని నరేంద్ర మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!