MK Stalin: ‘‘హిందీ 25 భాషల్ని నాశనం చేసింది’’.. కేంద్రం-తమిళనాడు మధ్య ఆగని గొడవ..
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ’’ వివాదం..
- హిందీ ఉత్తరాది భాషల్ని నాశనం చేసిందని స్టాలిన్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ‘‘హిందీ’’ వివాదం ముదురుతోంది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ విమర్శిస్తున్నారు. తమ రాష్ట్రంలో తమిళ, ఇంగ్లీష్ కలిగిన ‘‘ద్విభాషా విధానం’’కి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అయితే, ఎంకే స్టాలిన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తోంది. అన్ని భాషల్ని ఇష్టపూర్వకంగా నేర్చుకునే హక్కు అందరికి ఉంటుందని చెబుతోంది.
Read Also: Russia: భార్యకు నచ్చలేదని లగ్జరీ కారును డంపింగ్లో పడేసిన భర్త
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
తాజాగా, గురువారం ఎంకే స్టాలిన్ మరోసారి హిందీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలు బలవంతంగా హిందీని స్వీకరించడం వల్ల ‘‘100 ఏళ్లలో 25 స్థానిక ఉత్తరాది భాషల్ని హిందీ నాశనం చేసింది’’ అని ఆరోపించారు. బీజేపీ స్టాలిన్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది. హిందీ గుర్తింపు కోసం ప్రాచీన భాషల్ని చంపుతోందని, యూపీ, బీహార్లు ఎప్పుడూ ‘‘హిందీ హార్ట్ ల్యాండ్ ప్రాంతాలు’’ కావు అని అన్నారు. హిందీ ఉత్తర్ ప్రదేశ్ మాతృ భాష కాదని, యూపీ భోజ్పురి, బుందేల్ ఖండిలను కోల్పోయిందని స్టాలిన్ అన్నారు. ఉత్తరాఖండ్ కుమావోనీని కోల్పోయిందని, రాజస్థాన్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్లు తమ స్థానిక భాషలను కోల్పోయాయని స్టాలిన్ ఆరోపించారు.
ప్రస్తుతం, హిందీ వివాదం కేంద్రం, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదాలకు కారణమైంది. డీఎంకే నేతలతో పాటు పలు తమిళ నాయకులు కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే, తమిళనాడు మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇటీవల స్టాలిన్ ప్రకటించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..ఏ రాష్ట్రంపై ఏ భాషను రద్దే ప్రయత్నం తాము చేయడం లేదని చెప్పారు. మరోవైపు సినీ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!