MK Stalin: తమిళానికి కేవలం రూ. 74 కోట్లు, సంస్కృతానికి రూ. 1488 కోట్లా.?
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ’’ వివాదం..
- ఎన్ఈపీ ద్వారా హిందీని రద్దే ప్రయత్నం అంటూ స్టాలిన్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రి భాషా విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. NEP అమలు చేస్తే తమ రాష్ట్రం 2000 ఏళ్లు తిరోగమనం చెందుతుందని అన్నారు. దీనిని పాపం అంటూ పిలిచారు. కేంద్రం రూ. 10,000 కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని చెప్పారు.
త్రిభాషా విధానం ద్వారా హిందీని తమ రాష్ట్రంలో అమలు పరిచేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రయత్నిస్తున్నారని అంతకుముందు స్టాలిన్ విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రాన్ని లక్ష్యం చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 8 కోట్ల మంది మాట్లాడే తమిళ భాషాభివృద్ధికి కేవలం 74 కోట్లు మాత్రమే కేటాయించారని, కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడే సంస్కృతానికి రూ.1,488 కోట్లు కేటాయించారని అన్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Mangalyaan-2: ఇస్రో ‘‘మంగళయాన్-2’’.. ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్..
కేంద్రం తమిళభాష, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామని చెబుతూ, సంస్కృతాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. NEP అమలుపై కేంద్రం, తమిళనాడు మధ్య విభేదాలు ఉన్నాయి. కీలక పథకాలకు నిధులను నిలిపేసిందని కేంద్రంపై డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు సీఎం తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు తమిళం, ఇంగ్లీష్ భాషల ‘‘రెండు భాషల విధానాన్ని’’ మాత్రమే అనుసరిస్తుందని చెప్పారు.
అంతకుముందు.. కేంద్రం అమలు చేస్తున్న రెండు పథకాలు – సమగ్ర శిక్షా అభియాన్ (SSA) మరియు PM SHRI పాఠశాలలు – NEP తో అనుసంధానించడం ప్రాథమికంగా ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి పేర్కొంటూ స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా భాషా వివాదంలో చేరారు. ‘‘ఒక భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. వాటితో ఆడుకోకండి. తమిళులకు, పిల్లలకు కూడా వారికి ఏ భాష అవసరమో తెలుసు. వారికి ఏ భాష కావాలో ఎంచుకునే జ్ఞానం వారికి ఉంది” అని శుక్రవారం తన మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం) పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!