MK Stalin: తమిళానికి కేవలం రూ. 74 కోట్లు, సంస్కృతానికి రూ. 1488 కోట్లా.?
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ’’ వివాదం..
- ఎన్ఈపీ ద్వారా హిందీని రద్దే ప్రయత్నం అంటూ స్టాలిన్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రి భాషా విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. NEP అమలు చేస్తే తమ రాష్ట్రం 2000 ఏళ్లు తిరోగమనం చెందుతుందని అన్నారు. దీనిని పాపం అంటూ పిలిచారు. కేంద్రం రూ. 10,000 కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని చెప్పారు.
త్రిభాషా విధానం ద్వారా హిందీని తమ రాష్ట్రంలో అమలు పరిచేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రయత్నిస్తున్నారని అంతకుముందు స్టాలిన్ విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రాన్ని లక్ష్యం చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 8 కోట్ల మంది మాట్లాడే తమిళ భాషాభివృద్ధికి కేవలం 74 కోట్లు మాత్రమే కేటాయించారని, కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడే సంస్కృతానికి రూ.1,488 కోట్లు కేటాయించారని అన్నారు.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Mangalyaan-2: ఇస్రో ‘‘మంగళయాన్-2’’.. ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్..
కేంద్రం తమిళభాష, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామని చెబుతూ, సంస్కృతాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. NEP అమలుపై కేంద్రం, తమిళనాడు మధ్య విభేదాలు ఉన్నాయి. కీలక పథకాలకు నిధులను నిలిపేసిందని కేంద్రంపై డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు సీఎం తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు తమిళం, ఇంగ్లీష్ భాషల ‘‘రెండు భాషల విధానాన్ని’’ మాత్రమే అనుసరిస్తుందని చెప్పారు.
అంతకుముందు.. కేంద్రం అమలు చేస్తున్న రెండు పథకాలు – సమగ్ర శిక్షా అభియాన్ (SSA) మరియు PM SHRI పాఠశాలలు – NEP తో అనుసంధానించడం ప్రాథమికంగా ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి పేర్కొంటూ స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా భాషా వివాదంలో చేరారు. ‘‘ఒక భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. వాటితో ఆడుకోకండి. తమిళులకు, పిల్లలకు కూడా వారికి ఏ భాష అవసరమో తెలుసు. వారికి ఏ భాష కావాలో ఎంచుకునే జ్ఞానం వారికి ఉంది” అని శుక్రవారం తన మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం) పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!