Uttarakhand: కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ క్రాష్.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicoptor crashes near Uttarakhand’s Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్ నాథ్ కు రెండు కిలోమీటర్ల దూరంలో గరుడ్ చట్టిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు మరణించారు. గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం, వాతావరణ కారణాల వల్ల హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు వెళ్తోంది. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు. చనిపోయిన వారిని పూర్వ రామానుజ్, కృతి బ్రార్, ఉర్వి, సుజాత, ప్రేమ్ కుమార్, కాలా, పైలట్ అనిల్ సింగ్లుగా గుర్తించారు.
Read Also: Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
కేదార్ నాథ్ తీర్థయాత్ర ప్రాంతంలో తరుచుగా వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. దీంతోనే హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్లేందుకు కష్టతరమైన కాలినడక మార్గాన్ని అనుసరిస్తుంటారు. అయితే ఆర్థిక స్థోమత ఉన్న వారు మాత్రం హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ వెళ్తుంటారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన బెల్ 407 హెలికాప్టర్ వీటీ-ఆర్పీఎన్ మార్గం మధ్యలో కూలిపోయిందని తెలిపింది.
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేదార్ నాథ్ హెలికాప్టర్ ప్రమాదం బాధకరమని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ టీములు ఘటన స్థలంలో సహాయక చర్యలను ప్రారంభించాయి. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ కొండను ఢీకొని ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!