IIT Bombay: తాను చదువుకున్న ఐఐటీకీ రూ. 315 కోట్ల విరాళం
IIT Bombay: తాను చదువుకున్న విద్యాసంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు పూర్వ విద్యార్థి. విరాళం అంటే లక్షనో.. రెండు లక్షలో కాదు..ఏకంగా రూ. 315 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఆ పూర్వ విద్యార్థే ఎవరో కాదు.. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన నందన్ నిలేకని.. విరాళం ఇచ్చింది తాను ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న ఐఐటీ బాంబేకు ఈ భారీ విరాళం ప్రకటించారు. గతంలోనూ తాను ఐఐటీ బాంబేకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read also: Electricity Bill: కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందని ఆందోళన చెందుతున్నారా?.. ఈ లైట్ ఇంట్లో ఉంటే చాలు!
Also Read
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇన్స్టిట్యూట్తో తాను 50 ఏళ్ల అనుబంధం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ విరాళం ప్రకటించినట్టు ఆయన తెలిపారు. నందన్ నిలేకని 1973లో బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలో చేరారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను ఈ విరాళం ప్రకటించినట్టు తెలిపారు. బాంబే ఐఐటీ నా జీవితానికి మూలస్తంభంగా ఉంది. నా నిర్మాణ సంవత్సరాలను రూపొందించింది మరియు నా ప్రయాణానికి పునాది వేసింది. ఈ గౌరవప్రదమైన సంస్థతో నా అనుబంధానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా, దాని భవిష్యత్తుకు ముందుకు రావడానికి మరియు సహకరించడానికి నేను కృతజ్ఞుడను.. అందుకే సంస్థతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని నా వంతు సహకారం అందిస్తున్నాను. సంస్థకు భవిష్యత్తులోనూ నా సహకారం ఉంటుంది. ఇది కేవలం ఆర్థికం సహాయం కాదు. నాకు జీవితం ఎంతో ఇచ్చిన సంస్థ పట్ల నాకున్న గౌరవం. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దనున్న విద్యార్థుల పట్ల నిబద్ధతని నందన్ నిలేకని పేర్కొన్నారు.
Read also: Kaumari Devi: పూర్వజన్మల నుంచి వెంటాడే దోషాలను తొలగించే “కౌమారీ దేవి” ఆరాధన
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్ మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి మరియు IIT బాంబేలో లోతైన టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఈ విరాళం ఉద్దేశించబడింది. ఈ సహకారం భారతదేశంలో పూర్వ విద్యార్థి చేసిన అతిపెద్ద విరాళాలలో ఒకటని ఐఐటీ బాంబే పేర్కొంది. ఈ అవగాహనా ఒప్పందంపై నీలేకని మరియు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి బెంగళూరులో సంతకాలు చేశారు. ఈ చారిత్రాత్మక విరాళం IIT బాంబేని ప్రపంచ నాయకత్వ మార్గంలో నడిపిస్తుందని చౌదరి పేర్కొన్నట్లు సంస్థ ప్రకటన విడుదల పేర్కొంది. మా విశిష్ట పూర్వ విద్యార్థి నందన్ నీలేకని ఇన్స్టిట్యూట్కి తన పునాది, మార్గదర్శక సహకారాలను కొనసాగిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ చారిత్రాత్మక విరాళం IIT బాంబే వృద్ధిని గణనీయంగా వేగవంతం చేస్తుంది మరియు దానిని ప్రపంచ నాయకత్వ మార్గంలో దృఢంగా ఉంచుతుందని చౌదరి అన్నారు. గతంలోనూ ఆయన ఐఐటీ బాంబేకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేవలం ఆర్థికంగా అండగా ఉండడమే కాకుండా.. ఈ 50 ఏళ్లలో పలు హాదాల్లో సంస్థతో ఆయన అనుసంధానమయ్యే ఉన్నారు.
తాజావార్తలు
-
FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
-
Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!