Bhole Baba: చాలా బాధపడ్డాను, దోషులను విడిచిపెట్టబోం.. మీడియా ముందు భోలే బాబా ప్రత్యక్షం

  • మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా
  • జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని విచారం వ్యక్తం
Bhole Baba

Bhole Baba

Bhole Baba: హత్రాస్‌ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు. దోషులను విడిచిపెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఈ దుఃఖాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు మాకు ప్రసాదించుగాక అని భోలే బాబా అన్నారు.

“ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పరిపాలనను నమ్మండి. అరాచకాలను వ్యాపింపజేసిన వారెవరినీ విడిచిపెట్టరని నాకు నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని, జీవితాంతం వారికి సహాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాను.” అని భోలే బాబా పేర్కొన్నారు.

Read Also: Tripura HIV Cases: విద్యార్థులకు హెచ్‌ఐవీ.. 47 మంది మృతి

ప్రధాన నిందితుడు అరెస్ట్‌
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. యూపీ ఎస్టీఎఫ్ బృందం అతడిని ఆస్పత్రి నుంచే అదుపులోకి తీసుకుంది. ఈ విషయమై భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్‌ను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎస్టీఎఫ్‌, సిట్‌ బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మధుకర్‌ హార్ట్‌ పేషెంట్‌ కావడంపై లాయర్‌ ప్రస్తావిస్తూ.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ, బాబా తన సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో సంఘ వ్యతిరేకుల పాత్ర ఉందని పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంపై కూడా మాట్లాడారు.

హత్రాస్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ సమాచారాన్ని స్వయంగా సిట్‌లో చేర్చిన ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనుపమ్ కులశ్రేష్ఠ శుక్రవారం తెలిపారు.