Fuel Prices: అది నిజమే కావొచ్చు అంటున్న కేంద్ర మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హర్దీప్ సింగ్ పురి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ముడి చమురు కొరత ఉండదని, చమురు కంపెనీలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని అన్నారు. అయితే పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారాయన.. ముడి చమురు కొరత ఉండదని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.. మా అవసరాల్లో 85 శాతం ముడి చమురు దిగుమతులపై మరియు 50-55 శాతం గ్యాస్పై ఆధారపడి ఉన్నప్పటికీ, మా ఇంధన అవసరాలు తీరేలా చూస్తామని స్పష్టం చేశారు.
Read Also: Russia Ukraine War: యుద్ధ ఫలితం.. ఆంక్షలతో అల్లాడుతోన్న రష్యా..!
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఎన్నికల కారణంగా ఇంధన ధరలను కేంద్రం ముందుగానే తగ్గించిందని, ఎన్నికల తర్వాత మళ్లీ ధరలు పెంచుతారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ఏడాది కేంద్రం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించిందని గుర్తు చేశారు.. ప్రపంచవ్యాప్తంగా రేట్లు ఎందుకు పెంచారో అర్థం చేసుకోవడానికి ఉక్రెయిన్-రష్యా సంక్షోభం వంటి ఇతర పరిస్థితులను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. చమురు ధరలు ప్రపంచ ధరలను బట్టి నిర్ణయించబడతాయి.. ప్రపంచంలోని ఒక ప్రాంతంలో యుద్ధం లాంటి పరిస్థితి ఉంది.. చమురు కంపెనీలు దీనికి కారణమవుతాయి. చమురు కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయి. మేము మంచి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు.. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు, అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పడిపోయాయని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు, ఉక్రెయిన్లో ఉద్రిక్తత, సైనిక చర్య కారణంగా, చమురు ధరలు పెరిగాయని.. చమురు కంపెనీలు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాయి అని మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?