Fuel Prices: అది నిజమే కావొచ్చు అంటున్న కేంద్ర మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హర్దీప్ సింగ్ పురి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ముడి చమురు కొరత ఉండదని, చమురు కంపెనీలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని అన్నారు. అయితే పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారాయన.. ముడి చమురు కొరత ఉండదని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.. మా అవసరాల్లో 85 శాతం ముడి చమురు దిగుమతులపై మరియు 50-55 శాతం గ్యాస్పై ఆధారపడి ఉన్నప్పటికీ, మా ఇంధన అవసరాలు తీరేలా చూస్తామని స్పష్టం చేశారు.
Read Also: Russia Ukraine War: యుద్ధ ఫలితం.. ఆంక్షలతో అల్లాడుతోన్న రష్యా..!
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ఎన్నికల కారణంగా ఇంధన ధరలను కేంద్రం ముందుగానే తగ్గించిందని, ఎన్నికల తర్వాత మళ్లీ ధరలు పెంచుతారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ఏడాది కేంద్రం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించిందని గుర్తు చేశారు.. ప్రపంచవ్యాప్తంగా రేట్లు ఎందుకు పెంచారో అర్థం చేసుకోవడానికి ఉక్రెయిన్-రష్యా సంక్షోభం వంటి ఇతర పరిస్థితులను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. చమురు ధరలు ప్రపంచ ధరలను బట్టి నిర్ణయించబడతాయి.. ప్రపంచంలోని ఒక ప్రాంతంలో యుద్ధం లాంటి పరిస్థితి ఉంది.. చమురు కంపెనీలు దీనికి కారణమవుతాయి. చమురు కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయి. మేము మంచి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు.. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు, అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పడిపోయాయని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు, ఉక్రెయిన్లో ఉద్రిక్తత, సైనిక చర్య కారణంగా, చమురు ధరలు పెరిగాయని.. చమురు కంపెనీలు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాయి అని మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ