Bihar: మహిళపై వేధింపులు.. అరగుండు, మెడలో బూట్ల దండతో ఊరేగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వేధింపులు ఉంటున్నాయి. వేధింపుల స్థాయి పెరిగిపోయి అత్యాచారాలు, హత్యల వరకు వెళుతున్నాయి. అయితే కొన్ని ఘటనల్లో జరుగుతున్న వేధింపులు విచిత్రంగా ఉంటుంటాయి. అటువంటిదే ఈ ఘటన. మహిళను వేధించాడని ఒక యువకుడిని అరగుండు కొట్టించి.. బూట్ల దండవేసి అవమానించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. మహిళను యువకుడు వేధించ లేదని.. మహిళే.. యువకుడిని వేధించిందని స్థానికులు చెప్పడం కొసమెరుపు. మహిళను వేధిస్తున్నాడని యువకునికి అరగుండు చేయించి మెడలో చెప్పుల దండేసి ఊరేగించిన ఘటన బీహార్లోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తి కబర్లోని ఓ పిండి మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పిండిమిల్లుకు సంబంధించిన విషయాల్లో యజమాని రాజీవ్ కుమార్ ఇంటికి రెగ్యులర్గా వెళ్తుండేవాడు. ఇలా వెళ్తున్న క్రమంలో రాజీవ్ భార్యతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు గత కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆమె తన భర్తకు చెప్పింది. గత మూడు నెలలుగా సతాయిస్తున్నాడని, సమయం సందర్భం లేకుండా ఫోన్ చేస్తున్నాడని, ఇంటికి వస్తున్నానంటూ వేధిస్తున్నాడని భర్తకు చెప్పింది.
Read Also: Prabhas: యాడ దొరికిన సంతరా ఇది… సంపేత్తే సంపేయండి కానీ టెన్షన్ పెట్టకండి
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
భర్త కుటుంబ సభ్యులు ఆనంద్ను పట్టుకుని.. ఓ గుంజకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. తన భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ అర గుండు గీయించాడు. మెడలో పాత బూట్లతో చేసిన దండ వేసి ఊళ్లో ఊరేగించారు. అయితే అమాయకుడైన యువకుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఆ మహిళే ఆనంద్కు తరచూ ఫోన్ చేసేదని, ఇంటికి రావాలని పిలిపించుకునేదని చెప్పారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆనంద్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరుపక్షాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. ఎవరి తరపున ఫిర్యాదులు అందకపోవడంతోనే యువకున్ని వదలిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!