Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
- భారత్లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
- కచ్చితమైన ఓటరు జాబితానే లక్ష్యం
- సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సర్వే ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఈసీ ‘సర్’ నిర్వహించింది. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికలు సంఘం ఈ సర్వే చేస్తోందని ఆరోపించాయి. పబ్లిక్గా.. పార్లమెంట్ వేదికగా చాలా ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. అయినా కూడా తగ్గేదేలే అంటూ ఎన్నికల సంఘం తన పని కాచ్చేసింది.
తాజాగా ఇదే అంశంపై న్యాయవాదుల కోసం నిర్వహించిన రెండో జాతీయ సదస్సులో జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి భారత పౌరుడిని ఓటరు జాబితాలో చేర్చేందుకు ఎన్నికల యంత్రాంగం చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. అదే సమయంలో మరణించినవారు, డూప్లికేట్ పేర్లు ఉన్నవారు, చిరునామా మార్చినవారు, గైర్హాజరు ఓటర్లు, విదేశీ పౌరులు వంటి అర్హత లేని వ్యక్తుల పేర్లను ఓటరు జాబితాల నుంచి క్రమబద్ధంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమం భారత అత్యున్నత న్యాయస్థానం పరిశీలనను విజయవంతంగా ఎదుర్కొనడమే కాకుండా.. రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా 15 లక్షలకుపైగా బూత్ స్థాయి ఏజెంట్లు, అలాగే అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 11 లక్షలకుపైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROలు) ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్పై పనిచేస్తూ దేశానికి అత్యంత కచ్చితమైన ఓటరు జాబితాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, కచ్చితమైన ఓటరు జాబితాలను సిద్ధం చేయడం ఎన్నికల సంఘం లక్ష్యమని జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Speaking at the 2nd National Conference of Counsels Representing the Election Commission of India, Chief Election Commissioner of India Gyanesh Kumar says, “All citizens of India who have attained 18 years of age are being included proactively by our electoral… pic.twitter.com/hWr5Qr6m10
— ANI (@ANI) May 30, 2026
తాజావార్తలు
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!