Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- జానపద గాయకుడిపై భక్తులు నోట్ల వర్షం
- గానం ఆపకుండా పాడిన గాయకుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత్లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు భారత్లో కూడా ప్రధాని దగ్గర నుంచి పౌరులంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుజరాత్లోని ఓ జానపద గాయకుడిపై లక్షల రూపాయల నోట్లు కుమ్మరించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జునాగఢ్ జిల్లా ఖంభాలియా గ్రామంలో సంప్రదాయ ‘డైరో’ కార్యక్రమం జరిగింది. డైరో అనేది గుజరాత్లో సంగీతం, కథలు, హాస్యాన్ని మేళవించి నిర్వహించే ప్రత్యేక జానపద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గాయకుడు గోపాల్ సాధు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతుండగా భక్తులు పరవసించిపోయారు. ఇంకేముంది.. బ్యాగుల నిండా భారీగా నోట్ల కట్టలను తీసుకొచ్చి కుమ్మరించారు. సంచుల్లో తీసుకొచ్చిన డబ్బును వేదికపైనే కుమ్మరించడంతో గోపాల్ సాధు దాదాపు నోట్ల కుప్పలో కనిపించకుండా పోయారు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం ఆగకుండా తన గానం కొనసాగించారు.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదే అసలు వర్క్ ఫ్రం హోమ్.. కూర్చొని నోట్ల వర్షంలో తడుస్తున్నారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. “అంత డబ్బు మధ్యలో కూడా ప్రశాంతంగా పాడుతున్నారు” అంటూ మరొకరు స్పందించారు. ఇంకొందరు ఈ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.
ఇదే తరహా ఘటనలు గుజరాత్లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2023లో వల్సాద్లో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గడ్వీపై కూడా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్ల వర్షం కురిసింది. అలాగే 2022లో నవ్సారీలో జరిగిన మరో కార్యక్రమంలో ఆయనపై సుమారు రూ.50 లక్షల విలువైన నోట్లను భక్తులు కురిపించారు.
గుజరాత్లో జానపద సంగీత కార్యక్రమాల్లో గాయకులపై నగదు నోట్ల వర్షం కురిపించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించే సంప్రదాయం కూడా ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!