Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- జానపద గాయకుడిపై భక్తులు నోట్ల వర్షం
- గానం ఆపకుండా పాడిన గాయకుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత్లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు భారత్లో కూడా ప్రధాని దగ్గర నుంచి పౌరులంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుజరాత్లోని ఓ జానపద గాయకుడిపై లక్షల రూపాయల నోట్లు కుమ్మరించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జునాగఢ్ జిల్లా ఖంభాలియా గ్రామంలో సంప్రదాయ ‘డైరో’ కార్యక్రమం జరిగింది. డైరో అనేది గుజరాత్లో సంగీతం, కథలు, హాస్యాన్ని మేళవించి నిర్వహించే ప్రత్యేక జానపద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గాయకుడు గోపాల్ సాధు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతుండగా భక్తులు పరవసించిపోయారు. ఇంకేముంది.. బ్యాగుల నిండా భారీగా నోట్ల కట్టలను తీసుకొచ్చి కుమ్మరించారు. సంచుల్లో తీసుకొచ్చిన డబ్బును వేదికపైనే కుమ్మరించడంతో గోపాల్ సాధు దాదాపు నోట్ల కుప్పలో కనిపించకుండా పోయారు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం ఆగకుండా తన గానం కొనసాగించారు.
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదే అసలు వర్క్ ఫ్రం హోమ్.. కూర్చొని నోట్ల వర్షంలో తడుస్తున్నారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. “అంత డబ్బు మధ్యలో కూడా ప్రశాంతంగా పాడుతున్నారు” అంటూ మరొకరు స్పందించారు. ఇంకొందరు ఈ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.
ఇదే తరహా ఘటనలు గుజరాత్లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2023లో వల్సాద్లో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గడ్వీపై కూడా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్ల వర్షం కురిసింది. అలాగే 2022లో నవ్సారీలో జరిగిన మరో కార్యక్రమంలో ఆయనపై సుమారు రూ.50 లక్షల విలువైన నోట్లను భక్తులు కురిపించారు.
గుజరాత్లో జానపద సంగీత కార్యక్రమాల్లో గాయకులపై నగదు నోట్ల వర్షం కురిపించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించే సంప్రదాయం కూడా ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!