Cable Bridge Collapse: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. నదిలో పడిపోయిన 400 మంది సందర్శకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్చీ ప్రాంతంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన ఆదివారం సాయంత్ర కూలిపోయింది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ఉన్న దాదాపుగా 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. పునర్నిర్మాణం తరువాత ఐదు రోజుల క్రితమే కేబుల్ వంతెను పున:ప్రారంభించారు. బ్రిడ్జ్ పైకి ఒక్కసారిగా ప్రజలు రావడంతో వంతెన కూలిపోయింది. వంతెన సామర్థ్యం కన్నా ఎక్కువ మంది రావడంతోనే ప్రమాదం జరిగింది. ఆదివారం వేళ నది అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. ఈ సయమంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం వద్ద బాధితులు బంధువుల రోదనలు మిన్నంటాయి.
Read Also: Papikondalu: పర్యాటకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పాపికొండలు వెళ్లేందుకు బోట్లకు అనుమతి
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
నదిలో పలువురు పడిపోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టంపై అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. నదిలో పడిపోయిన వారిని స్థానికుల సహకారంతో అధికారులు కాపాడుతున్నారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్పందించారు. ప్రమాదం గురించి సీఎం అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. సాధ్యమైనంతగా అన్ని సహాయాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రమాదంలో మరణించిన వారికి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షలు, మరణించిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. గుజరాత్ ప్రభుత్వం తరుపున మరణించిన వారికి రూ.4 లక్షలు, గాయపడిన వారి రూ. 50,000 పరిహారాన్ని అందించనున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022
అమరావతిలో కుప్పకూలిన భవనం:
మహారాష్ట్ర అమరావతి పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ప్రభాత్ సినిమా ప్రాంతంలో ఉన్న భవనం ఆదివారం నాడు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. భవనం కూలిన ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనపై విచారణకు డివిజనల్ కమిషనర్ ను ఆదేశించినట్లు ట్వీట్ చేశారు. మరణించిన వారికి సీఎం ఏక్ నాథ్ షిండే రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!