GST 2.0 report: దుమ్మురేపిన దసరా కొనుగోళ్లు.. ఎలక్ట్రానిక్స్, కార్ల సేల్స్ అదుర్స్..
- ఫలితాలను ఇచ్చిన జీఎస్టీ సంస్కరణలు..
- దసరా ముందు రికార్డు వ్యాపారం..
- దుమ్మురేపిన ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST 2.0 report: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు సామాన్యుడికి మేలు చేశాయని కేంద్రమంత్రులు చెప్పారు. జీఎస్టీ రిపోర్టును మీడియాతో పంచుకున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల తగ్గిన పన్నుల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రమంతులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దసరా ముందు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగాయని ఆమె చెప్పారు.
‘‘ప్రభుత్వం 54 రోజువారీ వినియోగ వస్తువులను నిశితంగా పరిశీలిస్తోంది. వాటిలో ప్రతిదానిలోనూ, GST సంస్కరణల వల్ల కలిగే పన్ను ప్రయోజనం తుది వినియోగదారునికి చేరిందని మేము కనుగొన్నాము. ప్రధానమంత్రి దీపావళి బహుమతి అందించబడింది’’ అని ఆమె చెప్పారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారాలు ఊహించిన దాని కన్నా మరింత ఎక్కువగా సాగాయని, జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారులకు అందించామని నిర్మాలా సీతారామన్ చెప్పారు.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
Read Also: Asim Munir: మళ్లీ అవే వ్యాఖ్యలు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఇంకా బుద్ధి రాలేదు..
గత నెలలో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది. నిత్యావసర వస్తువలతో పాటు టీవీలు, రిఫ్రిజ్రేటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కార్ల ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరలు సెప్టెంబర్ 22న, నవరాత్రి ప్రారంభంలో అమలులోకి వచ్చాయి. జీఎస్టీ కోతల వల్ల సామాన్యుడి వద్ద డబ్బులు మిగిలాయని, వాహనాల కొనుగోలు ఎక్కువగా జరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. త్రివీలర్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 5.5 శాతం పెరిగాయని, ద్విచక్ర వాహనాలు 21.6 లక్షల యూనిట్లకు చేరుకుందని, సెప్టెంబర్ లో కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3.72 లక్షలుగా ఉన్నాయని ఆమె చెప్పారు. సెప్టెంబర్ నెలలో హీరో మోటార్స్ తన అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసిందని వెల్లడించారు. సెప్టెంబర్ 22న జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమైన మొదటి రోజే ఏసీ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, టీవీ అమ్మకాలు 30-35% పెరిగాయని కేంద్ర మంత్రి హైలైట్ చేశారు.
నవరాత్రి సందర్భంగా వాహన అమ్మకాలు పెరిగాయని, మారుతి సుజుకి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల కార్లను విక్రయించినట్లు వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. మహీంద్రా అమ్మకాలు 60 శాతం పెరిగాయని, టాటా 50,000 వాహనాలనున విక్రయించిందని, ఎలక్ట్రానిక్ రంగం కూడా అన్ని రికార్డుల్ని బద్ధలు కొట్టిందని గోయల్ చెప్పారు. ఈ ఏడాది రూ. 20 లక్షల కోట్ల విలువైన అదనపు ఎలక్ట్రానిక్ వినియోగం ఉంటుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అంచనా వేశారు. ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 25శాతం పెరిగాయని చెప్పారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!