దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్లో గత మూడు వారాలుగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను తక్షణమే 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత కారణంగా అనేక రెస్టారెంట్లు, డాబాలు , హోటళ్లు మూతపడే పరిస్థితి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన సరఫరాలో మొదటగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు , డైరీ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని స్పష్టం చేసింది.
Sundeep Kishan: సందీప్ కిషన్తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా
మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ ప్రక్రియ ఎల్లుండి (మార్చి 23) నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను విధించింది. కమర్షియల్ యూజర్లు , వలస కూలీలు సంబంధిత యాప్ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని తెలిపింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, కేవలం సరఫరాను క్రమబద్ధీకరించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
