Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
- ఇకపై పేపర్ ప్యాకెట్లలోనే గుట్కా, పాన్ మసాలా..
- ప్లాస్టిక్ ప్యాకేజింగ్పై FSSAI నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pan Masala: పాన్ మసాలా, గుట్కా ప్రియులకు, ఆయా కంపెనీలకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) షాక్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటి ప్యాకేజింగ్పై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాల్లో త్వరలోనే పెను మార్పులు రాబోతున్నాయి. వీటిని విక్రయించే ప్లాస్టిక్ ప్యాకెట్లు లేదా సాచెట్లను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త డ్రాఫ్ట్ నిబంధనలను సిద్ధం చేసింది.
కొత్త నిబంధనలు ఇవే..
ప్రభుత్వ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. ఇకపై పాన్ మసాలా వంటి ఉత్పత్తులను ప్లాస్టిక్ ప్యాకెట్లలో అమ్మడం కుదరదు. ప్లాస్టిక్ స్థానంలో కాగితం (Paper), పేపర్ బోర్డ్ లేదా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ప్యాకెట్లను మాత్రమే వాడాలి. ప్లాస్టిక్, పాలిథిన్, పివిసి వంటి ఏ రకమైన సింథటిక్ మెటీరియల్ను ప్యాకేజింగ్ కోసం ఉపయోగించకూడదు. చివరకు అల్యూమినియం ఫాయిల్తో కూడిన ప్యాకింగ్పై కూడా నిషేధం విధించే అవకాశం ఉంది. కేవలం అమ్మకాలే కాకుండా, ప్లాస్టిక్ సాచెట్లలో ఈ ఉత్పత్తులను నిల్వ చేయడం లేదా ప్యాకింగ్ చేయడంపై కూడా స్పష్టమైన నిషేధాన్ని ప్రతిపాదించారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై సాధారణ ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి 30 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఎందుకు ఈ నిర్ణయం అంటే..
ఈ కీలక నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే.. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని అరికట్టడం. ఈ చిన్నా చితకా ప్యాకెట్లు రీసైక్లింగ్ చేయడం కష్టంగా మారి పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమించాయని పర్యావరణ పరిరక్షలు అభిప్రాయపడుతున్నారు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్లోని రసాయనాలు పొగాకు ఉత్పత్తులతో కలిసినప్పుడు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ నిబంధనలు అమలులోకి వస్తే, మార్కెట్లో పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల రూపమే మారిపోనుంది. పర్యావరణ హితమైన ప్యాకేజింగ్లో ఇవి లభించనున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!