Selfie Tragedy: సెల్ఫీ మోజులో నలుగురు యువతులు బలి
Selfie Tragedy: ప్రస్తుతం ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో నలుగురు యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలను బలి తీసుకుంది. బెళగావి జిల్లాలో శనివారం మధ్యాహ్నం వాటర్ ఫాల్ వద్ద నలుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా నీళ్లలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది విద్యార్థుల బృందం కర్ణాటక సరిహద్దులోని కితవాడ జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఐదుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటూ వాటర్ఫాల్స్లో పడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోగా మరో యువతి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది.
మృతులను బెళగావిలోని ఉజ్వల్ నగర్కు చెందిన అసియా ముజావర్ (17), అంగోల్కు చెందిన కుద్షియా హసన్ పటేల్ (20), రుఖ్సర్ భిస్తీ (20), బెలగావిలోని జత్పత్ కాలనీకి చెందిన తస్మియాగా అధికారులు గుర్తించారు, వీరంతా బెళగావిలోని కామత్ గల్లి వద్ద ఉన్న మదర్సా విద్యార్థులు అని తెలిపారు. అయితే యువతులు నీటిలో పడిపోగానే వాళ్లను కాపాడేందుకు అక్కడ ఉన్న వారికి ఈత రాకపోవడంతో రక్షించలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాలికను ఎలాగోలా రక్షించి ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆసుపత్రి వైద్యులు చెప్పారని స్థానికులు వెల్లడించారు.
Also Read
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
Read Also: Rashmi Gautham: బికినీలో రష్మీ.. వీడియో వైరల్
అటు ఈ దుర్ఘటన గురించి తెలుసుకుని బెళగావి జిల్లా ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రి ప్రాంగణం చుట్టూ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర, బిమ్స్ ఆసుపత్రి సర్జన్ అన్నాసాహెబ్ పాటిల్ ఆసుపత్రికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!