కేంద్ర మంత్రిపై మన్మోహన్సింగ్ కుటుంబం ఆగ్రహం.. అలాగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మహన్మోహన్ సింగ్.. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయనను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యవహరించిన తీరుపై మన్మోహన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించిన సందర్భంగా మన్మోహన్ తో మంత్రి మాండవీయ ఫొటోలు తీయించుకోవడాన్ని తప్పుబట్టారు.. ఆ ఘటనపై మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.. తన తండ్రి, మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు.. ఆయనను పరామర్శించేందుకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం.. ఆస్పత్రికి వచ్చారని.. అయితే, ఆయనతోపాటు ఫొటోగ్రాఫర్ ఉండటాన్ని గమనించిన తన తల్లి.. ఆ ఫొటోగ్రాఫర్ను అనుమతించవద్దని, ఫొటోలు తీయొద్దని వారించారని.. అయినా, ఆమె మాటలను పట్టించుకోకుండా తన తండ్రితో కలిసి మాండవీయకు ఫొటోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, మా నాన్న డెంగ్యూతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు దమన్ సింగ్.. కానీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని.. ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో సందర్శకులను అనుమతించడం లేదన్నారు. తన తండ్రిని పరామర్శించేందుకు మంత్రి మన్సుఖ్ మాండవీయ రావడం మంచి విషయమే.. కానీ, ఆ సమయంలో ఫొటోలు దిగే పరిస్థితిలో తన తల్లిదండ్రులు లేరన్న ఆమె.. ఫొటోగ్రాఫర్ను గది నుంచి పంపించేయాలని తన తల్లి ఎంతచెప్పినా వినకుండా.. ఫొటోలో దిగారని మండిపడ్డారు.. ఈ ఘటనపై ఆమె చాలా బాధపడ్డారని తెలిపారు.. మరోవైపు.. మన్మోహన్ సింగ్తో తాను తీయించుకున్న ఫొటోలను మంత్రి మాండవీయ.. సోషల్ మీడియాలో పంచుకున్నారు.. దానిపై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో.. మళ్లీ డెలిట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, మన్మోహన్ సింగ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని.. ఆయన కోలుకుంటున్నారని తాజా బులెటన్లో పేర్కొన్నారు ఎయిమ్స్ వైద్యులు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!