Pakistan: భారత ‘‘త్రిశూల్’’తో వణికి చస్తున్న పాకిస్తాన్.. రెండోసారి నోటమ్ జారీ..
- భారత త్రిశూల్ విన్యాసాలతో పాకిస్తాన్లో భయం..
- సర్క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు..
- ఐదు రోజుల్లో రెండోసారి ‘‘నోటమ్’’ జారీ చేసిన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారతదేశం పెద్ద ఎత్తున త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహిస్తోంది. ‘‘త్రిశూల్ 2025’’ ఎక్సర్సైజ్ పేరుతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర త్రివిధ దళాలు పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మూడు దళాలు కలిసి పాల్గొంటున్నాయి. 20,000 మంది సైనికులతో పాటు T-90S, అర్జున్ ట్యాంకులు, రాఫెల్, సుఖోయ్ యుద్ధవిమానాలు, నేవీ నౌకలు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు పాక్ సరిహద్దుల్లోని సర్క్రీక్ వద్ద ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతోంది.
Read Also: Funds Release : ఉద్యోగులకు గుడ్న్యూస్.. బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అయితే, భారత పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండటంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. రెండోసారి నోటమ్(NOTAM) జారీ చేసింది. ఐదు రోజుల్లో పాకిస్తాన్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఇది రెండోసారి. పాక్ జాగ్రత్త, భయంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. NOTAM (Notice to Airmen) హెచ్చరికలు విమానయాన సంస్థలకు ఇచ్చే హెచ్చరిక. ఈ ప్రాంతం మీదుగా విమానాలు ఎగరొద్దు అనే సమాచారాన్ని దీని ద్వారా ఇస్తారు.
పాకిస్తాన్ నవంబర్ 1 నుంచి 30 వరకు తన దక్షిణ తీర ప్రాంత గగనతలాన్ని మూసేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. పాక్ నేవీ లైవ్-ఫైరింగ్ డ్రిల్లు, క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా, సరిహద్దుల్లో భారత్ పెద్ద ఎత్తున విన్యాసాలు చేయడంతో భయంతో కూడా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దక్షిణ వైమానిక స్థావరాలు, సర్ క్రీక్, దాని పరిసర ప్రాంతాల సమీపంలోని నావికా దళాలపై భారత దేశం ఖచ్చితమైన దాడులు ప్రారంభించవచ్చనే అనుమానం పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ తన రక్షణను నవంబర్ 30 వరకు తన దళాలన్నింటిని రెడ్ అలర్ట్లో ఉంచినట్లు సమచారం.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!