The Legend of Maula Jatt::భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం సంబంధాలు బాగా లేవు. ఎప్పుడైతా పుల్వామా, ఉరీ, పఠాన్ కోట్ ఉగ్రదాడులు జరిగాయో అప్పటినుంచి ఇరు దేశాలు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాలు సంబంధాలు క్షీణించాయి. ఏకపక్షంగా పాక్, భారత్తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది. దీని ప్రభావం పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తుంది. బయట మార్కెట్ నుంచి అంటే ఇండియా నుంచి యూఏఈ, సౌదీ వెళ్లే వస్తువులనే ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మూవీ ఇండస్ట్రీలో బహుబలిగా చెప్పబడుతున్న ‘‘ది లెజెండ్ ఆఫ్ హౌలా జాట్’’ సినిమా భారతదేశంలో విడుదల చేసేందుకు అనుమతి రాలేదు. 2019 నుంచి పాకిస్తాన్లో భారతీయ సినిమాల విడుదలపై ఆ దేశం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో కూడా ఈ సినిమా విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం పంజాబ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Read Also: Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభం ‘‘డ్యాన్స్’’ ఈవెంట్.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ఈ సినిమాకు విడుదల చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రలో సినిమాని ప్రదర్శించడానికి తమ పార్టీ అనుమతించడని ట్వీట్ చేశారు. పాకిస్థానీ చిత్రాలను భారతదేశంలో విడుదల చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు మరియు దేశంలో ఎక్కడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. శివసేన(ఠాక్రే) నేత ఆనంద్ దూబే కూడా ఈ సినిమా విడుదలపై తన అసమ్మతిని వ్యక్తం చేశారు. ‘పాకిస్థానీ సినిమాను ఇండియాలో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది.. మన దేశంలో ఆర్టిస్టులు లేరా.. మనం ఇక్కడ సినిమాలు చేయలేదా?’ అని ప్రశ్నించారు.
భారతదేశంలో పాకిస్తానీ ఆర్టిస్టులపై నిషేధం ఉంది. 2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత భారతీయ సినిమాల్లో నటిస్తున్న పాకిస్తానీ ఆర్టిస్టులపై నిషేధం అమలులోకి వచ్చింది. అంతకుముందు పాకిస్తానీ స్టార్ ఫవాద్ హుస్సేన్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ‘‘ఏ దిల్ హై ముష్కిల్’’ సినిమాలో నటించారు. మహిరా ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన రయీస్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు వీరిద్దరు కూడా ‘‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’’ సినిమాలో ఉన్నారు.