The Legend of Maula Jatt: పాకిస్తాన్ ‘‘బాహుబలి’’ సినిమా.. భారత్లో విడుదల బంద్..
- ‘‘ ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’’ భారత్లో విడుదల బంద్..
- అత్యధిక వసూళ్లు సాధించిన పాకిస్తాన్ చిత్రంగా గుర్తింపు..
- రాజ్ ఠాక్రేతో పాటు శివసేన నేతల హెచ్చరిక..
- భారత సినిమాలపై పాకిస్తాన్లో నిషేధం..
- దీంతోనే సినిమా విడుదల భారత్లో బంద్..
The Legend of Maula Jatt::భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం సంబంధాలు బాగా లేవు. ఎప్పుడైతా పుల్వామా, ఉరీ, పఠాన్ కోట్ ఉగ్రదాడులు జరిగాయో అప్పటినుంచి ఇరు దేశాలు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాలు సంబంధాలు క్షీణించాయి. ఏకపక్షంగా పాక్, భారత్తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది. దీని ప్రభావం పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తుంది. బయట మార్కెట్ నుంచి అంటే ఇండియా నుంచి యూఏఈ, సౌదీ వెళ్లే వస్తువులనే ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మూవీ ఇండస్ట్రీలో బహుబలిగా చెప్పబడుతున్న ‘‘ది లెజెండ్ ఆఫ్ హౌలా జాట్’’ సినిమా భారతదేశంలో విడుదల చేసేందుకు అనుమతి రాలేదు. 2019 నుంచి పాకిస్తాన్లో భారతీయ సినిమాల విడుదలపై ఆ దేశం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో కూడా ఈ సినిమా విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం పంజాబ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభం ‘‘డ్యాన్స్’’ ఈవెంట్.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ఈ సినిమాకు విడుదల చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రలో సినిమాని ప్రదర్శించడానికి తమ పార్టీ అనుమతించడని ట్వీట్ చేశారు. పాకిస్థానీ చిత్రాలను భారతదేశంలో విడుదల చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు మరియు దేశంలో ఎక్కడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. శివసేన(ఠాక్రే) నేత ఆనంద్ దూబే కూడా ఈ సినిమా విడుదలపై తన అసమ్మతిని వ్యక్తం చేశారు. ‘పాకిస్థానీ సినిమాను ఇండియాలో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది.. మన దేశంలో ఆర్టిస్టులు లేరా.. మనం ఇక్కడ సినిమాలు చేయలేదా?’ అని ప్రశ్నించారు.
భారతదేశంలో పాకిస్తానీ ఆర్టిస్టులపై నిషేధం ఉంది. 2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత భారతీయ సినిమాల్లో నటిస్తున్న పాకిస్తానీ ఆర్టిస్టులపై నిషేధం అమలులోకి వచ్చింది. అంతకుముందు పాకిస్తానీ స్టార్ ఫవాద్ హుస్సేన్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ‘‘ఏ దిల్ హై ముష్కిల్’’ సినిమాలో నటించారు. మహిరా ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన రయీస్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు వీరిద్దరు కూడా ‘‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’’ సినిమాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!