కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో మూడు నాలుగు వారాలు పోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారనుంది. ఇప్పటికే దేశంలో రోజుకు వచ్చే కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మున్ముందు తీవ్రత పీక్ స్టేజ్ కు పోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటికి ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ముందు ముందు కేసులెక్కువైతే ఆస్పత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం రోజురోజుకు పాజిటివిటీ రేట్ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పట్టణాల నుంచి జనమంతా పల్లెబాట పట్టారు. ఈ పరిస్థితి మరింత ప్రమాదమని.. వైద్యనిపుణులు.. చెబుతున్నారు. పట్నం నుంచి వైరస్ పల్లెలకు వ్యాపించడం ఖాయమని అంటున్నారు సీనియర్ పిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు.
Read Also: సీఎం జగన్, చిరంజీవి భేటీ.. సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. పదిరోజులకు ముందు పరిస్థితి వేరు.. ఇప్పుడున్న పరిస్థితి వేరు.. మరో వారం రోజుల్లో… కేసులు రెట్టింపవడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. తీవ్రత తక్కువగా ఉందని ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దని.. వేరియంట్ ఏదైనా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పండగని అంతా కలిసి పూయి.. ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదంటున్నారు.