Amit Shah: ప్రతీ భారతీయుడికి ఛత్రపతి శివాజీ గురించి బోధించాలి..
- ప్రతీ భారతీయుడికి ఛత్రపతి శివాజీ గురించి బోధించాలి..
- వర్ధంతి వేళ అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతీ భారతీయుడికి బోధించాలని, ప్రతీ తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ప్రతీ భారతీయుడికి మాతృభూమికి సేవ చేయడం, సుపరిపాలనలో ఆదర్శవంతమైన మరాఠా సామ్రాజ్య స్థాపకుడి గురించి చెప్పాలని కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి షా మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ని మహారాష్ట్రకే పరిమితం చేయవద్దని, ఆయన నుంచి దేశం, ప్రపంచం ప్రేరణ పొందుతుందని చెప్పారు.
Read Also: Allahabad High Court: అరెస్ట్కి కారణం తెలియజేయకపోవడం, బెయిల్ ఇవ్వడానికి కారణం అవుతుంది..
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
రాజమాత జిజియా బాయి యువ శివాజీ మనసులో మంచి విలువలను నింపారని, స్వరాజ్యం, స్వధర్మం, భాషను పునరుద్ధరించడానికి ఆమె ప్రేరణనిచ్చిందని అమిత్ షా అన్నారు. చిన్నతనంలోనే మొత్తం దేశాన్ని ఏకం చేసి విముక్తి చేయాలనే ఆలోచనను ఆమె శివాజీకి ఇచ్చిందని, జిజౌ మా సాహెబ్ కూడా హిందవి స్వరాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ మహారాజ్కి ప్రేరణగా నిలిచిందని చెప్పారు. భారతదేశంలో ప్రతీ బిడ్డ కూడా ఛత్రపతి చరిత్రను తెలుసుకోవాలని, వారికి తెలియజేయడం మనందరి బాధ్యత అని చెప్పారు.
‘‘12 ఏళ్ల బాలుడు సింధు నుండి కన్యాకుమారి వరకు కాషాయ జెండాను ఎగురవేస్తానని ప్రమాణం చేశాడు. నేను చాలా మంది వీరుల జీవిత చరిత్రలను చదివాను, కానీ అజేయమైన సంకల్ప శక్తి, గొప్ప వ్యూహం, ఈ వ్యూహాన్ని విజయవంతం చేయడానికి సమాజంలోని ప్రజలందరినీ ఏకం చేయడం ద్వారా, మరాఠాలు అపజయం లేని సైన్యాన్ని నిర్మించారు. వారు మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. వారి పోరాటం ఫలితంగా దేశం రక్షించబడింది, భాష రక్షించబడింది. స్వాతంత్ర్యం తర్వాత, మనం ప్రపంచంలోనే ఉన్నతంగా నిలుస్తున్నాం’’ అని అమిత్ షా అన్నారు. నేడు హిందవి స్వరాజ్ కోసం బలమైన సంకల్పం ఏర్పడిందని, భారతదేశం స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి ప్రపంచంలోనే తొలిస్థానలో ఉంటామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
-
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!