Mahua Moitra: డిసెంబర్ 4న లోక్సభ ముందుకు మహువా మోయిత్రా ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసు రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణల్ని ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. క్యాష్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు డిసెంబర్ 4న లోక్సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రానను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సూచించింది. లోక్ సభ నిర్ణయంపై ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది. వినోద్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న తృణమూల్ ఎంపీకి వ్యతిరేకంగా నివేదికను ఆమోదించింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నివేదికను సమర్పించింది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అభియోగానలు ఎథిక్స్ ప్యానెల్ లోని ఆరుగురు సభ్యులు సమర్థించగా.. నలుగురు సభ్యులు వ్యతిరేకించారు.
Read Also: Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాత్ దూబే ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జై ఆనంత్ దేహద్రాయ్, ఆమె లంచాలు తీసుకున్నట్లు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నందున ఆరోపణలు చేస్తున్నట్లు దూబే పేర్కొన్నారు. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని కూడా ఇతరులతో పంచుకున్నట్లు, దుబాయ్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్ మరియు బెంగళూరు నుంచి ఆమె ఐడీని యాక్సెస్ చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు వ్యాపారవేత్త హీరానందానీ పార్లమెంట్కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ప్రధాని నరేంద్రమోడీ, అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుంటూ ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె అడిగిన దాదాపుగా అన్నీ ఈ వ్యవహారంపైనే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణల్ని న్యాయవాది దేహద్రాయ్ తనపై వ్యక్తిగత పగతో చేశారని మోయిత్రా ఆరోపించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ముందుగా ఆచితూచి స్పందించిన తృణమూల్, ఇటీవల ఏకంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కావాలనే మహువామోయిత్రాను టార్గెట్ చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమెకే ప్లస్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!