Mahua Moitra: డిసెంబర్ 4న లోక్సభ ముందుకు మహువా మోయిత్రా ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసు రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణల్ని ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. క్యాష్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు డిసెంబర్ 4న లోక్సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రానను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సూచించింది. లోక్ సభ నిర్ణయంపై ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది. వినోద్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న తృణమూల్ ఎంపీకి వ్యతిరేకంగా నివేదికను ఆమోదించింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నివేదికను సమర్పించింది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అభియోగానలు ఎథిక్స్ ప్యానెల్ లోని ఆరుగురు సభ్యులు సమర్థించగా.. నలుగురు సభ్యులు వ్యతిరేకించారు.
Read Also: Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు
Also Read
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాత్ దూబే ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జై ఆనంత్ దేహద్రాయ్, ఆమె లంచాలు తీసుకున్నట్లు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నందున ఆరోపణలు చేస్తున్నట్లు దూబే పేర్కొన్నారు. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని కూడా ఇతరులతో పంచుకున్నట్లు, దుబాయ్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్ మరియు బెంగళూరు నుంచి ఆమె ఐడీని యాక్సెస్ చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు వ్యాపారవేత్త హీరానందానీ పార్లమెంట్కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ప్రధాని నరేంద్రమోడీ, అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుంటూ ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె అడిగిన దాదాపుగా అన్నీ ఈ వ్యవహారంపైనే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణల్ని న్యాయవాది దేహద్రాయ్ తనపై వ్యక్తిగత పగతో చేశారని మోయిత్రా ఆరోపించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ముందుగా ఆచితూచి స్పందించిన తృణమూల్, ఇటీవల ఏకంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కావాలనే మహువామోయిత్రాను టార్గెట్ చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమెకే ప్లస్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!