PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు
- మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- 24 గంటల్లోగా మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ‘ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, పలువురు ఇతర బీజేపీ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం పూర్తి ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆదేశించాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా పరిగణించింది. మోడీపై ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్య ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, 24 గంటల్లోగా మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా స్పందన తెలియజేయాలని కోరుతూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు. మోదీ ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఖర్గే తెలిపారు.
కమిషన్కు సమర్పించిన మెమోరాండంలో, ఖర్గే చేసిన వ్యాఖ్యలకు గాను భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తగిన శిక్షాత్మక, నియంత్రణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఖర్గేను విమర్శిస్తూ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రమాదకరమైన దాడి అని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?