Election Commission: ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..
- ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- డిసెంబర్ 11వ తేదీ వరకు సవరణ జరగనున్నట్లు ప్రకటించిన ఈసీ..
- డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల..
- 12 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజులు గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్- నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుంది.
Read Also: Jagtial: సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
సవరించిన ముఖ్య తేదీలు
* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం కొత్త తేదీలను ప్రకటించింది.
* ఎన్యూమరేషన్ (ఓటర్ల లెక్కించే) కాలం: డిసెంబర్ 11, (గురువారం) వరకు పొడిగించింది.
* పోలింగ్ స్టేషన్లు హేతుబద్ధీకరణ/ పునర్వ్యవస్థీకరణ: డిసెంబర్ 11, (గురువారం) నాటికి పూర్తి చేయాలి..
* కంట్రోల్ టేబుల్ నవీకరణ, ముసాయిదా జాబితా తయారీ: డిసెంబర్ 12-15, 2025 (శుక్రవారం నుంచి సోమవారం).
* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబర్ 16, 2025 (మంగళవారం).
* క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు గడువు: డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 (గురువారం) వరకు.
* నోటీసు దశ: డిసెంబర్ 16, 2025 నుంచి ఫిబ్రవరి 7, 2026 (శనివారం) వరకు.. ఈ సమయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ జబితాలోని అభ్యంతరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్లను ఏకకాలంలో పరిష్కరిస్తారు.
Read Also: Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ 10పై 14 వేల తగ్గింపు.. ఎగబడిన జనం, స్టాక్ ఓవర్!
పౌరులకు ముఖ్య సూచన
ఓటర్ల జాబితా ఖచ్చితమైనది. అలాగే, సమ్మిళితంగా ఉండేలా చూడాలనే ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నంలో భాగంగా SIRను తీసుకొచ్చింది. ఈ గడువు పొడిగింపు ముఖ్యంగా రాబోయే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలు దాఖలు చేయడానికి లేదా అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. ఈసీ ప్రకటించిన 12 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. తద్వారా భవిష్యత్తు ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!