Election Commission: ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..
- ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- డిసెంబర్ 11వ తేదీ వరకు సవరణ జరగనున్నట్లు ప్రకటించిన ఈసీ..
- డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల..
- 12 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజులు గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్- నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుంది.
Read Also: Jagtial: సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
సవరించిన ముఖ్య తేదీలు
* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం కొత్త తేదీలను ప్రకటించింది.
* ఎన్యూమరేషన్ (ఓటర్ల లెక్కించే) కాలం: డిసెంబర్ 11, (గురువారం) వరకు పొడిగించింది.
* పోలింగ్ స్టేషన్లు హేతుబద్ధీకరణ/ పునర్వ్యవస్థీకరణ: డిసెంబర్ 11, (గురువారం) నాటికి పూర్తి చేయాలి..
* కంట్రోల్ టేబుల్ నవీకరణ, ముసాయిదా జాబితా తయారీ: డిసెంబర్ 12-15, 2025 (శుక్రవారం నుంచి సోమవారం).
* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబర్ 16, 2025 (మంగళవారం).
* క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు గడువు: డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 (గురువారం) వరకు.
* నోటీసు దశ: డిసెంబర్ 16, 2025 నుంచి ఫిబ్రవరి 7, 2026 (శనివారం) వరకు.. ఈ సమయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ జబితాలోని అభ్యంతరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్లను ఏకకాలంలో పరిష్కరిస్తారు.
Read Also: Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ 10పై 14 వేల తగ్గింపు.. ఎగబడిన జనం, స్టాక్ ఓవర్!
పౌరులకు ముఖ్య సూచన
ఓటర్ల జాబితా ఖచ్చితమైనది. అలాగే, సమ్మిళితంగా ఉండేలా చూడాలనే ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నంలో భాగంగా SIRను తీసుకొచ్చింది. ఈ గడువు పొడిగింపు ముఖ్యంగా రాబోయే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలు దాఖలు చేయడానికి లేదా అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. ఈసీ ప్రకటించిన 12 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. తద్వారా భవిష్యత్తు ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!