Election Commission: ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..
- ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- డిసెంబర్ 11వ తేదీ వరకు సవరణ జరగనున్నట్లు ప్రకటించిన ఈసీ..
- డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల..
- 12 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజులు గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్- నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుంది.
Read Also: Jagtial: సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
సవరించిన ముఖ్య తేదీలు
* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం కొత్త తేదీలను ప్రకటించింది.
* ఎన్యూమరేషన్ (ఓటర్ల లెక్కించే) కాలం: డిసెంబర్ 11, (గురువారం) వరకు పొడిగించింది.
* పోలింగ్ స్టేషన్లు హేతుబద్ధీకరణ/ పునర్వ్యవస్థీకరణ: డిసెంబర్ 11, (గురువారం) నాటికి పూర్తి చేయాలి..
* కంట్రోల్ టేబుల్ నవీకరణ, ముసాయిదా జాబితా తయారీ: డిసెంబర్ 12-15, 2025 (శుక్రవారం నుంచి సోమవారం).
* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబర్ 16, 2025 (మంగళవారం).
* క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు గడువు: డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 (గురువారం) వరకు.
* నోటీసు దశ: డిసెంబర్ 16, 2025 నుంచి ఫిబ్రవరి 7, 2026 (శనివారం) వరకు.. ఈ సమయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ జబితాలోని అభ్యంతరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్లను ఏకకాలంలో పరిష్కరిస్తారు.
Read Also: Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ 10పై 14 వేల తగ్గింపు.. ఎగబడిన జనం, స్టాక్ ఓవర్!
పౌరులకు ముఖ్య సూచన
ఓటర్ల జాబితా ఖచ్చితమైనది. అలాగే, సమ్మిళితంగా ఉండేలా చూడాలనే ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నంలో భాగంగా SIRను తీసుకొచ్చింది. ఈ గడువు పొడిగింపు ముఖ్యంగా రాబోయే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలు దాఖలు చేయడానికి లేదా అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. ఈసీ ప్రకటించిన 12 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. తద్వారా భవిష్యత్తు ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!