Al-Falah University: అల్-ఫలాహ్ వర్సిటీలో ఈడీ దాడులు.. 25 చోట్ల ఏకకాలంలో సోదాలు
- అల్-ఫలాహ్ వర్సిటీలో ఈడీ దాడులు
- 25 చోట్ల ఏకకాలంలో సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు దాడులు చేస్తున్నాయి. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, 25 ప్రదేశాలపై ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. జామియానగర్లో అల్-ఫలాహ్ సంస్థల వ్యవస్థాపకుడు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన నిధులపై దర్యాప్తు చేస్తున్నారు.
ఫరీదాబాద్లో 70 ఎకరాల్లో విశ్వవిద్యాలయ క్యాంపస్ ఉంది. టెర్రర్ మాడ్యూల్లో ఉన్న ముగ్గురు డాక్టర్లు కూడా అల్-ఫలాహ్ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తోంది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
విశ్వవిద్యాలయం నిధులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈడీ సోదాలకు దిగింది. విశ్వవిద్యాలయం ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఆర్థిక లావాదేవీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Trump-Mamdani: ట్రంప్ అపాయింట్మెంట్ కోరిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ.. వైట్హౌస్ ప్రవేశం దొరికేనా?
ఇప్పటికే విశ్వవిద్యాలయం సభ్యత్వం రద్దైంది. యూనివర్సిటీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదంటూ భారత విశ్వవిద్యాలయాల సంఘం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశాయి. మోసం, ఫోర్జరీ అభియోగాల కింద కేసులు నమోదు అయ్యాయి.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: వామ్మో.. ఉగ్రవాదులు ఒళ్లు గగుర్పొడిచే ప్లాన్.. వెలుగులోకి కొత్త ప్రణాళిక!
అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం 2014లో స్థాపించబడింది. మరుసటి సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందింది. ఈ యూనివర్సిటీ 1995లో అల్-ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థాపించింది. 1997లో ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించింది. అనంతరం మెడికల్ కాలేజీగా మారింది. విశ్వవిద్యాలయంలో వైద్య శాస్త్రం, ఇంజనీరింగ్, సాంకేతికత, మానవీయ శాస్త్రాలు, కంప్యూటర్ సైన్స్ కోర్సులను అందించే పాఠశాలలు ఉన్నాయి.
ఫరీదాబాద్ నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న తర్వాత విశ్వవిద్యాలయం వెలుగులోకి వచ్చింది. అల్-ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్తో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ క్యాంపస్ వెలుపల అద్దెకు తీసుకున్న గదుల్లో దాదాపు 2,900 కిలోల బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలోని మరో డాక్టర్ షాహీన్ కారులో అస్సాల్ట్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాక ఆమెను అరెస్టు చేశారు. ఈ వార్త వెలువడిన కొన్ని గంటల తర్వాత ఎర్రకోట సమీపంలో కారు పేలి 13 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ కూడా అల్-ఫలాహ్లో పనిచేశాడు. ఇతడు కూడా బ్లాస్ట్లో చనిపోయాడు.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ (డాక్టర్) భూపిందర్ కౌర్ ఆనంద్ మాట్లాడుతూ.. దురదృష్టకర పరిణామాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు వైద్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. విశ్వవిద్యాలయంలో వైద్యులు అధికారిక హోదాలో పనిచేస్తున్నారు తప్ప, విశ్వవిద్యాలయానికి వారితో ఎటువంటి సంబంధం లేదన్నారు.
#WATCH | Delhi terror blast case: Haryana DGP OP Singh leaves from Al-Falah University in Faridabad pic.twitter.com/gE9uHOTvAt
— ANI (@ANI) November 18, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!