Supreme Court: పోలీసులతో కలిసి మమత సాక్ష్యాలను దొంగిలించారు.. ఈడీ ఆరోపణలు
- సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ వర్సెస్ ఈడీ
- పోలీసులతో కలిసి మమత సాక్ష్యాలను దొంగిలించారు
- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-ఈడీ మధ్య నెలకొన్న ఫైటింగ్ సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులతో మమత కుమ్మక్కై సాక్ష్యాలను దొంగిలించారని తెలిపింది. ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి చేసినప్పుడు బెంగాల్ పోలీసులు దర్యాప్తు బృందానికి సహకరించకుండా.. మమత ప్రభుత్వానికి సహయం చేసిందని పేర్కొంది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా సంఘటనాస్థలికి వచ్చి అధికారుల నుంచి ల్యాప్ట్యాప్లు, ముఖ్యమైన పత్రాలు, మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. డీజీపీ రాజీవ్ కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కోల్కతా హైకోర్టులో విచారణ జరగకపోవడంతోనే సుప్రీంకోర్టుకు వచ్చినట్లుగా తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎంసీ-ఈడీ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే సుప్రీంకోర్టు జోక్యం పుచ్చుకుంది. గందరగోళం సృష్టించొద్దని సూచించింది. ఉద్దేశం పూర్వకంగానే కోర్టులో గొడవ సృష్టిస్తున్నారని తుషార్ మెహతా ఆరోపించారు. కోల్కతా హైకోర్టులో పరిస్థితులు చేదాటిపోవడంతోనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టును జంతర్మంతర్గా మార్చాలనుకుంటున్నారా? అని టీఎంసీని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!