Supreme Court: పోలీసులతో కలిసి మమత సాక్ష్యాలను దొంగిలించారు.. ఈడీ ఆరోపణలు
- సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ వర్సెస్ ఈడీ
- పోలీసులతో కలిసి మమత సాక్ష్యాలను దొంగిలించారు
- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-ఈడీ మధ్య నెలకొన్న ఫైటింగ్ సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులతో మమత కుమ్మక్కై సాక్ష్యాలను దొంగిలించారని తెలిపింది. ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి చేసినప్పుడు బెంగాల్ పోలీసులు దర్యాప్తు బృందానికి సహకరించకుండా.. మమత ప్రభుత్వానికి సహయం చేసిందని పేర్కొంది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా సంఘటనాస్థలికి వచ్చి అధికారుల నుంచి ల్యాప్ట్యాప్లు, ముఖ్యమైన పత్రాలు, మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. డీజీపీ రాజీవ్ కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కోల్కతా హైకోర్టులో విచారణ జరగకపోవడంతోనే సుప్రీంకోర్టుకు వచ్చినట్లుగా తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎంసీ-ఈడీ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే సుప్రీంకోర్టు జోక్యం పుచ్చుకుంది. గందరగోళం సృష్టించొద్దని సూచించింది. ఉద్దేశం పూర్వకంగానే కోర్టులో గొడవ సృష్టిస్తున్నారని తుషార్ మెహతా ఆరోపించారు. కోల్కతా హైకోర్టులో పరిస్థితులు చేదాటిపోవడంతోనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టును జంతర్మంతర్గా మార్చాలనుకుంటున్నారా? అని టీఎంసీని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!