Rare-earths: “అరుదైన భూమి” కోసం భారత్ ఆరాటం.. చైనాకు చెక్ పెట్టే ప్లాన్..
- రేర్ ఎర్త్ మెటీరియల్స్ వేటలో భారత్..
- చైనాపై అతిగా ఆధారపడొద్దనే యోచన..
- అరుదైన అయస్కాంతాల తయారీకి మాస్టర్ ప్లాన్..
- ఈవీ రంగంలో కీలకంగా ఈ అయస్కాంతాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare-earths: రేర్ ఎర్త్ మెటీరియల్స్పై చైనాపై ఆధారపడకుండా భారత్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ముక్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లోని మోటర్స్లో ఉపయోగించే రేర్ ఎర్త్ అయస్కాంతాలపై చైనా దేశంపై అతిగా ఆధారపడొద్దని భారత్ నిర్ణయించుకుంది. ప్రపంచంలో ప్రస్తుతం రేర్ ఎర్త్ మూలకాలు, అయస్కాంతాల ఉత్పత్తిలో చైనా నియంతృత్వం కొనసాగుతోంది. దీంతోనే, భారత్ 25 బిలియన్ రూపాయలు ($290 మిలియన్లు) విలువైన ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. ఇది ఈ అయస్కాంతాలను తయారు చేసేలా పెద్ద ప్రైవేట్ కంపెనీలను ఆకర్షిస్తుంది.
ఈ పాలసీకి సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిని కేబినెట్ ఆమోదం కోసం సమర్పించే అవకాశం ఉందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవకు, ప్రముఖ కంపెనీలైన వేదాంత గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్తో సహా ఈవీ విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తున్నాయి.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే..
ఏడేళ్ల కాలంలో స్థానికంగా తవ్విన ముడి పదార్థాలను ఉపయోగించి సుమారు 4000 టన్నుల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తిలో మూడు లేదా నాలుగు పెద్ద కంపెనీలకు మద్దతు ఇవ్వాలని భారత్ యోచిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ని దెబ్బకొట్టేందుకు చైనా ఎప్పుడైనా ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సరఫరాను నిలిపేసే అవకాశం ఉండటంతో భారత్ ముందుజాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్ ప్రాసెసింగ్లో దాదాపు 90 శాతం నియంత్రణను చైనా కలిగి ఉంది.
ప్రతిపాదిత బ్లూ ప్రింట్ ప్రకారం, కంపెనీలు 500 టన్నుల నుంచి 1500 టన్నుల మధ్య వార్షిక ఉత్పత్తి సామర్థ్యాల కోసం వేలం వేస్తాయిన బ్లూమ్బెర్గ్ నివేదించింది. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనరంగం వేగం పుంజుకుంది. ప్రజలు విద్యుత్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత ఆటోమొబైల్ రంగానికి రేర్ ఎర్త్ అయస్కాంతాలు చాలా కీలకం.
భారతదేశం చాలా కాలంగా దేశీయంగా లేదా విదేశీ ప్రాజెక్టుల ద్వారా అరుదైన ఖనిజ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. సబ్సిడీలు లేకుండా భారత్లో ఈ తరహా అయస్కాంతాలను ఉత్పత్తి చేయడం దాదాపుగా అసాధ్యం. అందుకనే ఆసక్తి చూపించే కంపెనీలకు ప్రోత్సహకాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!