ఉత్తర భారత్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, హర్యానాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 2.8గా నమోదైంది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. హర్యానాలోని సోనిపట్లోనూ భూప్రకంపనలు జరిగాయి. సోమవారం ఉదయం 8:44 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలు గురించి ఎలాంటి సమాచారం అందలేదు.
ఇది కూాడా చదవండి: Tejashwi Yadav: ఆర్జేడీ కొత్త వ్యూహం.. తేజస్వి యాదవ్కు ప్రమోషన్!
