Jammu Earthquake: జమ్మూలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Earthquake: జమ్మూ కాశ్మీర్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.9గా నమోదయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ కాశ్మీర్ ను భూకంపాలు వదలడం లేదు. తాజాగా దోడా జిల్లాలో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 5.38 గంటలకు వచ్చిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదు అయ్యింది.
Read also: Gudivada Amarnath: జగన్కి సవాల్ చేయడమంటే.. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్లే
Also Read
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
జమ్మూకాశ్మీర్ లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 4.9గా నమోదు అయ్యింది. దోడా జిల్లాలో ఉదయం 5.38 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో సోమవారం భూమి కంపించింది. దీని లాట్: 33.15, పొడవు: 75.68, లోతు: 10 కిలో మీటర్లుగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం రాత్రి 5.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.39 గంటలకు 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అలాగే ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో ఆదివారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్డీఎస్) తెలిపింది. 54.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 5.354 డిగ్రీలు, 94.569 డిగ్రీలుగా నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12.14 గంటలకు భూప్రకంపనలు వచ్చాయని, 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!