EAM Jaishankar: ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై జైశంకర్ అసంతృప్తి
- ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై జైశంకర్ అసంతృప్తి..
- ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు చేయాలని పిలుపు..
- భారత్ పై పాకిస్థాన్ తప్పుడు ఆరోపణలు చేస్తుంది: జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EAM Jaishankar: ఐరాస 80వ వార్షికోత్సవం నేపథ్యంలో పోస్టల్ స్టాంపు విడుదల చేసిన సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేకపోతున్నాయని పేర్కొన్నారు. వివాదాల యుగంలో శాంతి అనేది అవసరం.. ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుంది.. ఈ క్రమంలో యూఎన్లో అంతా సరిగ్గా లేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో అర్థవంతమైన సంస్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది అత్యవసరమైనప్పటికీ.. మార్పులు జరిగేలా ఆ సంస్కరణలు ఉండాలని తెలిపారు. యూఎన్ కు భారత్ ఎప్పుడూ బలమైన మద్దతుదారుగానే ఉంటుంది.. కానీ.. ఐరాస నిర్ణయాలు దాని సభ్యత్వాన్ని, ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించడం లేదన్నారు.
Read Also: Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..
Also Read
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
- TMC crisis: టీఎంసీ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేల డుమ్మా.. మమతా పార్టీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం!
అలాగే, మైనారిటీల రక్షణకు, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులు కాపాడేందుకు భారత్ సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత ఛైర్మన్గా ఉన్న స్విట్జర్లాండ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలకు భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. ఆ దేశం జాత్యహంకారం, క్రమబద్ధమైన వివక్ష, విదేశీయులపై నెట్టడం మంచి పద్దతి కాదని పేర్కొనింది. ముందు తమ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించింది. మరోవైపు.. పహల్గాంలో పౌరులపై జరిగిన ఉగ్రదాడిని వరల్డ్ వైడ్ గా ఖండించినప్పటికీ.. పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదని విమర్శించారు.
Read Also: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం
ఇక, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పదే పదే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్పై నిందలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను మేము ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్లు చెప్పారు. అలాగే, ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించేందుకు యూఎన్ సమావేశాల్లో పాక్ దౌత్యవేత్తలు ప్రయత్నం చేయడాన్ని భారత్ తీవ్రంగా తప్పబట్టింది.
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?