Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- డీఆర్డీఓ టెక్నాలజీ దేశీయ పరిశ్రమలకు బదిలీ..
- ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..
- ప్రైవేట్ సంస్థలు రావడంతో పెరగనున్న క్షిపణుల తయారీ..
- విదేశీ ద్రవ్యం ఆదాతో పాటు ఎగుమతి పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమకు బదిలీ చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ టెక్నాలజీ బదలాయింపుతో దేశంలోనే క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. గతంలో ప్రభుత్వం రంగ సంస్థల వద్ద ఉన్న ఈ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా క్షిపణుల ఉత్పత్తి మరింత పెరగనుంది. ఇదే సమయంలో కంపెనీల అర్హత, ధ్రువీకరణ, నియంత్రణ అసవరాలను బట్టి, కంపెనీలు అన్ని ప్రమాణాలు పాటించిన తర్వాతే ఈ టెక్నాలజీ షేరింగ్ ఉంటుంది.
దేశంలోనే అధునాతన క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సరఫరాకు అంతరాయం కలగకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యం కీలకంగా మారనుంది. కేంద్రం నిర్ణయం వల్ల రక్షణ తయారీ వ్యవస్థ మరింత విస్తరిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర సాంకేతిక భాగస్వాములు కూడా క్షిపణుల సప్లై చైన్లో భాగస్వామం అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఇదే కాకుండా, అధునాతన రక్షణ వ్యవస్థల కోసం భారత్ విదేశీ సరఫరాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు డీఆర్డీవో సాంకేతికను అందించడం ద్వారా ఈ ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో క్షిపణి వ్యవస్థల్ని తయారు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా చేయడంతో పాటు అవసరమైన సమయంలో ఆయుధాల లభ్యతను వేగంగా పెంచే అవకాశం ఉంది. ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం వల్ల రక్షణ తయారీ రంగంలో పోటీ, సాంకేతిక ఆవిష్కరణలు కూడా సాధ్యం అవుతాయి. అంతర్జాతీయ ఎగుమతి చేసే సామర్థ్యం పెరుగుతుంది.
In a significant step towards achieving the vision of Aatmanirbharta in defence, Raksha Mantri Shri @rajnathsingh has approved the transfer of DRDO-developed technologies of all conventional missile systems to Indian industries for production within the country. This Transfer of…
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) August 25, 2026
తాజావార్తలు
-
Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!