Wolf Attacks: పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర.. నరమాంస భక్షక తోడేళ్లను పట్టుకునేందుకు ప్లాన్..
- యూపీని భయపెడుతున్న నరమాంస భక్షక తోడేళ్లు..
- పిల్లలే టార్గెట్గా దాడులు చేస్తున్న తోడేళ్ల గుంపు..
- పట్టుకునేందుకు అధికారుల వ్యూహాలు..
- పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి. గత 50 రోజులుగా ఏడుగురు పిల్లల్ని, ఒక మహిళలను చంపేశాయి. మరో 25 మందిని గాయపరిచాయి. అయితే, ఈ తోడేళ్లను పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం తంటాలు పడుతోంది. అనేక వ్యూహాలు అనుసరించి వీటిని ఊళ్లకు దూరంగా తరలించడం లేదా పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.
యుపి అటవీ శాఖ మరియు జిల్లా యంత్రాంగం 150 మంది అటవీ అధికారులతో సహా 250 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. ఆగస్టు 29న ఎట్టకేలకు ఒక తోడేలుని బంధించారు. ఇప్పటి వరకు చిక్కుకున్న తోడేళ్ల సంఖ్య 4కి చేరింది. అయితే గుంపులో మరో రెండు తోడేళ్లు ఇప్పటి వరకు పట్టుబడలేదు. వీటి కోసం వేట కొనసాగుతోంది. వీటిని పట్టుకునేందుకు అధికారులు మూడు సెట్ల థర్మల్ డ్రోన్ కెమెరాలను, ఉచ్చులను వినియోగిస్తున్నారు. బహ్రైచ్ జిల్లా మహాసి తాహసీల్లోని వర్ది ప్రాంతంలో 25 నుంచి 30 గ్రామాల్లో నివసించే 50,000 మందికి ఈ తోడేళ్లు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయి.
Also Read
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
Read Also: AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ.. రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు..
ఇదిలా ఉంటే, అధికారులు సరికొత్త వ్యూహంతో ఈ తోడేళ్లను పట్టుకునేందుకు ముందుకు వచ్చారు. పిల్లలను పోలి ఉండే బొమ్మలను పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు తిరిగే ప్రాంతంలో పెడుతున్నారు. ఈ బొమ్మల్ని తోడేళ్లు తిరిగే నది ఒడ్డులు, గుహలు ఉన్న ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ‘‘తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తుంటాయి. సాధారణంగా రాత్రి వేళల్లో వేటాడుతాయి. మానవ సహజ వాసనలను అనుసరించేలా వాటిని తప్పుదారి పట్టించేలా బొమ్మలను పలు ప్రాంతాల్లో ఉంచి, వాటిని బోనులో బంధించాలని చూస్తున్నాం’’ అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు.
తరుచుగా పిల్లల్ని తోడేళ్లు లక్ష్యంగా చేసుకుంటుండటంతో బొమ్మల్ని పిల్లల్లా ఆకర్షించే రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో తోడేళ్లను తరిమేయడానికి బ్రిటీష్ వారు ప్రయత్నించారు. వాటిని చంపిని వారికి బహుమతుల్ని కూడా అందించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ తోడేళ్లు ఇదే ప్రాంతంలో జీవించగలిగాయి. ఆరు తోడేళ్ల సమూహం జూలై 17 నుంచి బహ్రైచ్ జిల్లాలో గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..