Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Dolls Soaked In Childrens Urine Used To Capture Killer Wolves In Ups Bahraich

Wolf Attacks: పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర.. నరమాంస భక్షక తోడేళ్లను పట్టుకునేందుకు ప్లాన్..

Published Date :September 2, 2024 , 4:57 pm
By Venu Goapl Reddy
  • యూపీని భయపెడుతున్న నరమాంస భక్షక తోడేళ్లు..
  • పిల్లలే టార్గెట్‌గా దాడులు చేస్తున్న తోడేళ్ల గుంపు..
  • పట్టుకునేందుకు అధికారుల వ్యూహాలు..
  • పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర..
Wolf Attacks: పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర.. నరమాంస భక్షక తోడేళ్లను పట్టుకునేందుకు ప్లాన్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి. గత 50 రోజులుగా ఏడుగురు పిల్లల్ని, ఒక మహిళలను చంపేశాయి. మరో 25 మందిని గాయపరిచాయి. అయితే, ఈ తోడేళ్లను పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం తంటాలు పడుతోంది. అనేక వ్యూహాలు అనుసరించి వీటిని ఊళ్లకు దూరంగా తరలించడం లేదా పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

యుపి అటవీ శాఖ మరియు జిల్లా యంత్రాంగం 150 మంది అటవీ అధికారులతో సహా 250 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. ఆగస్టు 29న ఎట్టకేలకు ఒక తోడేలుని బంధించారు. ఇప్పటి వరకు చిక్కుకున్న తోడేళ్ల సంఖ్య 4కి చేరింది. అయితే గుంపులో మరో రెండు తోడేళ్లు ఇప్పటి వరకు పట్టుబడలేదు. వీటి కోసం వేట కొనసాగుతోంది. వీటిని పట్టుకునేందుకు అధికారులు మూడు సెట్ల థర్మల్ డ్రోన్ కెమెరాలను, ఉచ్చులను వినియోగిస్తున్నారు. బహ్రైచ్ జిల్లా మహాసి తాహసీల్‌లోని వర్ది ప్రాంతంలో 25 నుంచి 30 గ్రామాల్లో నివసించే 50,000 మందికి ఈ తోడేళ్లు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయి.

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
Add as a preferred
source on google

Read Also: AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ.. రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు..

ఇదిలా ఉంటే, అధికారులు సరికొత్త వ్యూహంతో ఈ తోడేళ్లను పట్టుకునేందుకు ముందుకు వచ్చారు. పిల్లలను పోలి ఉండే బొమ్మలను పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు తిరిగే ప్రాంతంలో పెడుతున్నారు. ఈ బొమ్మల్ని తోడేళ్లు తిరిగే నది ఒడ్డులు, గుహలు ఉన్న ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ‘‘తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తుంటాయి. సాధారణంగా రాత్రి వేళల్లో వేటాడుతాయి. మానవ సహజ వాసనలను అనుసరించేలా వాటిని తప్పుదారి పట్టించేలా బొమ్మలను పలు ప్రాంతాల్లో ఉంచి, వాటిని బోనులో బంధించాలని చూస్తున్నాం’’ అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు.

తరుచుగా పిల్లల్ని తోడేళ్లు లక్ష్యంగా చేసుకుంటుండటంతో బొమ్మల్ని పిల్లల్లా ఆకర్షించే రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో తోడేళ్లను తరిమేయడానికి బ్రిటీష్ వారు ప్రయత్నించారు. వాటిని చంపిని వారికి బహుమతుల్ని కూడా అందించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ తోడేళ్లు ఇదే ప్రాంతంలో జీవించగలిగాయి. ఆరు తోడేళ్ల సమూహం జూలై 17 నుంచి బహ్రైచ్ జిల్లాలో గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • animal attack
  • Bahraich
  • killer wolves in UP
  • Uttar Pradesh
  • Wolf attack

తాజావార్తలు

  • Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

  • Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!

  • Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!

  • Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!

  • TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions