Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర, విచారణకు మంత్రి ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors forgot to remove forceps from Kerala woman’s stomach: సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ కడుపులో కత్తెర మరిచారు. దీంతో గత ఐదేళ్లుగా కేరళకు చెందిన హర్షినా అనే మహిళ తీవ్ర నొప్పిని భరిస్తోంది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గలేదు. గత ఆరు నెలలుగా నొప్పి తగ్గేందుకు హర్షినాకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్ తో చికిత్స చేశారు అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే చెకప్ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కడుపులో ఓ లోహ వస్తువు ఉన్నట్లు స్కానింగ్ లో బయటపడింది.
2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు హర్షినాకు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడే ‘‘ఫోర్సెప్స్’’ను కడుపులోనే మరిచారు. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్స సమయంలో రక్తనాళాలను బిగించేందుకు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. అయితే అప్పటి నుంచి సదరు మహిళ నొప్పితో బాధపడుతోంది. అంతకుముందు రెండు సార్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంది హర్షినా. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీలో సిజేరియన్ చేసినప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడేది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: South Africa: రెండో వన్డేకు ముందు విషాదంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
మూడవ శస్త్రచికిత్స తరువాత నొప్పిని భరించే దానిని అని.. అయితే ఇది సిజేరియన్ వల్లే అని అనుకున్నానని..దీని కోసం చాలా సార్లు వైద్యులను సంప్రదించానని ఆమె చెప్పుకొచ్చారు. నా కడుపులో ఉన్న లోహపు వస్తువు మూత్రనాళాన్ని గుచ్చుకోవడంతో భరించలేని నొప్పి వచ్చేదని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపలోని ఫోర్సెప్స్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై హర్షినా, వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం విచారణకు ఆదేశించారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఆరోగ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!