Thalapathy Vijay: దళపతి విజయ్కి డీఎంకే పార్టీ భయపడుతోంది.. ఏఐడీఎంకే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన కొత్త మూవీ లియోపై తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. దీనిపై అధికార డీఎంకేపై ఏఐడీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఏఐడీఎంకే ప్రభుత్వంలో సమాచార, ప్రచార మంత్రిగా పనిచేసిన కదంబూర్ రాజు డీఎంకేని విమర్శించారు. లియో షో టైమింగ్స్ పై ఆంక్షలు విధించినందుకు డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లియో మూవీ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాకు 5 షోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి 1.30 గంటలకు మాత్రమే షోలకు అనుమతి ఇచ్చింది.
Read Also: Nikki Haley: గాజా పౌరులను ఎందుకు మీ దేశాల్లోకి అనుమతించడం లేదు.. ఇస్లామిక్ దేశాలపై మండిపాటు..
Also Read
- West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
ఈ నేపథ్యంలో ఇది పొలిటికల్ వివాదానికి దారి తీసింది. దళపతి విజయ్ని చూసి డీఎంకే భయపడుతోందని, అందుకనే లియో మూవీపై ఆంక్షలు విధిస్తోందని కదంబూర్ రాజు విమర్శించారు. విజయ్, అజిత్ వంటి టాప్ స్టార్లకు స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, దీపావళి, పొంగల్ సమయంలో అగ్రతారల కోసం ప్రత్యేక షోలకు అనుమతించాలని, మా పాలనలో ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
2006-2011 మధ్య కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే జరిగిందని రాజు గుర్తు చేశారు. తమిళ సినిమాల విడుదలపై ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తోందని కూడా కదంబూర్ రాజు ఆరోపించారు. అన్నాడీఎంకే అధినేత ‘లియో’ ఆడియో లాంచ్ రద్దు చేయడంలో కూడా డీఎంకే పాత్ర ఉందన్నారు. అయితే చెన్నైలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈవెంట్ కి జరిగిన విధంగా సమస్యలు తలెత్తుతాయనే కారణంగానే లియో ఆడియో లాంచ్ ను రద్దు చేయాల్సి వచ్చిందని డీఎంకే వర్గాలు తెలిపాయి. సామర్థ్యానికి మించి జనాలు హాజరైతే సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతోనే ఇలా చేశామని డీఎంకే తెలుపుతోంది.
తాజావార్తలు
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్లోకి స్వాగతం’ అంటూ..
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!